Mokshagnya: నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ మనందరికీ సుపరిచితమే. తన తండ్రి లాగానే మోక్షజ్ఞ కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతాడేమో అని నందమూరి అభిమానులంతా 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా మోక్షజ్ఞ సిని ఎంట్రీ పై అనేక ప్రచారాలు జరిగినప్పటికీ ఇప్పటివరకు ఊసు మాటా లేదు. ఇక ఇదిలా ఉంటే నందమూరి కుటుంబం లో ఉన్న మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా మనకి తెలుసు.
తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలను చేసిన తారక్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో నందమూరి ఫ్యామిలీలో అనేక గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క బాలయ్య మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ కి అస్సలు పడడం లేదు. ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీపించేస్తూ తన ఫ్యాన్స్ కి మండిస్తున్నాడు బాలయ్య.
ఈ క్రమంలోనే తన కుటుంబం లో ఉన్న ఎవ్వరిని జూనియర్ ఎన్టీఆర్ తో కానీ కళ్యాణ్ రామ్ తో కానీ మాట్లాడనివ్వడం లేదట బాలయ్య. ఇక మోక్షజ్ఞ కూడా ఇదివరకు అన్న.. అన్న అని తిరిగి ఇప్పుడు ముఖ పరిచయం కూడా లేని వాడిలాగా ప్రవర్తిస్తున్నాడట. ఓ ఫంక్షన్ లో కలిసిన తారక్ మరియు మోక్షజ్ఞని తారక్ పలకరిద్దామని అనుకున్నప్పటికీ మోక్షజ్ఞ చూసి చూడనట్లు వెళ్లిపోయాడట.
ఇక ఆ సిచువేషన్ ని అర్థం చేసుకున్న తారక్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడట. ఏదేమైనా గొడవలు అనేది సహజం.. కానీ తండ్రికి ,అన్నకి మధ్య ఉన్న గొడవలకి మోక్షజ్ఞ మాట్లాడకపోవడానికి ఎంతో డిఫరెన్స్ ఉంది. ఇదివరకు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి బంధాన్ని ఒక్కసారిగా మోక్షజ్ఞ అలా చేసేటప్పటికీ ఎన్టీఆర్ తట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా మోక్షజ్ఞ చేసింది తప్పే అంటున్నారు ప్రేక్షకులు.