Nagababu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి నిశ్చితార్థం జరగడం తెలిసిందే. త్వరలో వేల పెళ్లి ఇటలీలో జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరిగింది. ఈ షూట్ లో మెగా ఫ్యామిలీకి చెందిన అందరూ పాల్గొన్నారు. ఒక్క పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ కొంతమంది తప్ప మిగతావాళ్లంతా ఫోటోలలో సందడి చేయడం జరిగింది. దీంతో మరికొద్ది నెలలోనే పెళ్లి కూడా జరగబోతున్నట్లు మంచి చలి సీజన్ లో ఇటలీలో.. ఈ వివాహ కార్యక్రమం జరగనుందని ప్రచారం జరుగుతుంది.
ఇలాంటి క్రమంలో కూతురు నీహారిక పెళ్లి విషయంలో జరిగిన తప్పు కొడుకు విషయంలో జరగకూడదని నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు టాక్. విషయంలోకి వెళ్తే నిహారిక పెళ్లిలో.. ముహూర్తం దాటాక తాళి కట్టడం జరిగిందట. దాంతో తర్వాత పరిణామాలు అంతా తెలిసిందే. నీహారిక.. చైతన్య ఇద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే వరుణ్ తేజ్ పెళ్లిలో పక్కాగా ముహూర్తానికే తాళి కట్టే విధంగా పెళ్లి చేసే పంతులతో కలిసి పకడ్బందీగా నాగబాబు ప్లాన్ చేయడం జరిగిందట.
ఈ క్రమంలో ఫోటోషూట్స్ కన్నా ముహూర్తానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ పంతులుగారు పెట్టిన ముహూర్తానికే వరుణ్ లావణ్య మెడలో మూడు ముళ్ళు వేసేలా పక్క ప్లాన్ తో.. నాగబాబు ఈవెంట్ దగ్గరుండి చూసుకుంటున్నారట. పెళ్లికి వారం రోజుల ముందే మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్లంతా ఇటలీ వెళ్ళబోతున్నట్లు అక్కడ.. ఒక లగ్జరీ స్టార్ హోటల్ కూడా బుక్ చేసినట్లు సమాచారం. కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి చాలా ఘనంగా నాగబాబు చేస్తున్నారు. ఇప్పటికే ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగిందట. ఇటలీలో పెళ్లి వేడుక కేవలం కుటుంబ సభ్యులు స్నేహితులు కొద్దిమంది సమక్షంలో జరగనుందని సమాచారం. ఆ తర్వాత హైదరాబాదులో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్న వేడుకకు ఇండస్ట్రీ మరియు రాజకీయ ప్రముఖుల అందరికీ నాగబాబు ఆహ్వానించబోతున్నట్లు టాక్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!