రాజమౌళి దర్శకత్వంలో .. 450 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ చిత్రం `RRR`. ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి బాలీవుడ్ తారలు నటిస్తున్నారు. రాంచరణ్ జతగా అలియాభట్ నటిస్తోంది. ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్ జోన్స్ హీరోయిన్గా నటించాల్సింది. అయితే ఆమె కొన్ని అనివార్య కారణాలతో ప్రాజెక్ట్ నుండి తప్పకుంది. దీంతో రాజమౌళి ఎన్టీఆర్ హీరోయిన్ కోసం సంప్రదింపులు చేస్తున్నాడు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం `RRR`లో నిత్యామీనన్ నటించే అవకాశాలున్నాయి. ఎందుకంటే రీసెంట్గా ఈమె హైదరాబాద్కు వచ్చి రాజమౌళితో చర్చలు జరిపింది. అయితే ఈమెను ఎన్టీఆర్ సరసన నటింప చేస్తారా? లేక ఏదైనా కీలక పాత్ర కోసం సంప్రదింపులు చేస్తున్నారా? అని తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!