NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దాదాపు నాలుగేళ్ల శ్రమించి రూపొందించిన భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్` ఎట్టకేలకు మార్చి 25న అట్టహాసంగా విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ చిత్రానికి సిక్వెల్ వస్తే బాగుంటుందని అభిమానులే కాదు సినీ ప్రియులు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
పైగా ప్రముఖ స్టార్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.. ఆ దైవానుగ్రహం ఉంటే సీక్వెల్ ఉంటుందని చెప్పి మరిన్ని అంచనాలను పెంచేశారు. దీంతో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలు ఎక్కడకు వెళ్లినా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే.. `ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కావాలని చాలామంది అడుగుతున్నారు. మాక్కూడా సెకండ్ పార్ట్ తీస్తే బాగుంటుందని అనిపిస్తోంది. రాజమౌళి కనక సీక్వెల్ చేయకపోతే మీరందరూ ఆయన్ని చంపేసేలా ఉన్నారు. ఆయన కచ్చితంగా రెండో పార్ట్ తీస్తారని ఆశిద్దాం` అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు.
దీంతో ఎన్టీఆర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. కాగా, ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన విషయం తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. జూన్లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!