Paluke Bangaramayenaa Today Episode March 13 2024 Episode175: అభిషేక్ ఇంటికి వచ్చి అందరికీ స్వీట్లు పంచుతాడు. ఏంటి బంగారం మీ అన్నయ్య అందరి కి స్వీట్లు పంచుతున్నాడు ఈసారి ఎవరిని జైల్లో వేశాడు అని రవీంద్ర అంటాడు. ఏంటి నాన్న ఏంటి విశేషం అని యశోద అడుగుతుంది. నాకు ప్రమోషన్ వచ్చిందమ్మా కమిషనర్ గారే పిలిచి నాకు చెప్పారు అని అభిషేక్ సంతోషంతో అంటాడు. నువ్వు ఎదుగుతున్న సేపు నిన్ను పడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు నువ్వు జాగ్రత్తగా ఉండు నాన్న అని యశోద చెబుతుంది. ఒకప్పుడు నేనే కేసులకు వెళ్లొద్దు గొడవలు పెట్టుకోవద్దని ఆంక్షలు పెట్టేదాన్ని కానీ తర్వాత నీకు ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదని తెలుసుకున్నాను నీ దారిలో నిన్ను వెళ్ళనిచ్చాను అప్పుడు నీకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు ఎందుకంటే నా కొడుకు మీద నాకున్న నమ్మకం ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావుఅలాగే ఉండు అదే నేను ఉన్నత శిఖరాలకి చేరుస్తుంది నీ ధర్మం నిజాయితీ నీ నిబంధన ఈ మూడే నిన్ను కాపాడుతాయి అని యశోద అంటుంది.
అలాగే అమ్మ అని అభిషేక్ అంటాడు. చందన రవీంద్ర కంగ్రాజులేషన్స్ చెబుతారు. నీ ధర్మాన్ని వదిలి పెట్టకుండా ఇదే నియమ నిబంధనలతో ఉండు నాన్న నువ్వే ముందుకు వెళ్తావు అని వాళ్ళ బామ్మ చెబుతుంది. ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు. కట్ చేస్తే, నాకు ప్రమోషన్ వచ్చింది అనగానే స్వర సంతోషపడుతుంది నాకు ప్రమోషన్ రావడానికి స్వర ముఖ్య కారణం ప్రతి దానికి పార్టీ లేదా అని అడుగుతుంది తనకు మంచి పార్టీ ఇవ్వాలి సంతోషిస్తుంది అని అభిషేక్ అనుకుంటాడు.నాన్న మీరు టాబ్లెట్ వేసుకుంటే జ్వరం త్వరగా తగ్గిపోతుంది అని ఇస్తుంది స్వర. ఇంతలో అభిషేక్ వచ్చి మీరేమీ భయపడకండి స్వర చదువుకోడానికి నేను కూడా తోడుగా ఉంటాను అని అభిషేక్ అంటాడు.స్వర నాకు ప్రమోషన్ వచ్చింది అని స్వీట్ ఇస్తాడు అభిషేక్. కంగ్రాట్యులేషన్స్ సార్ అని బాధపడుతూ చెబుతుంది స్వర. వాళ్ల నాన్న ఆరోగ్యం బాగోలేదని బాధపడుతున్నట్టు ఉంది అని అభిషేక్ అనుకుంటాడు.
స్వర ఒకసారి ఇలా రా అని తీసుకువెళ్లి చదువుకోమని చెబుతాడు. నా మనసేం బాగోలేదు అని స్వర అంటుంది. స్వర సార్ని నేను చూసుకుంటానన్నాను కదా సార్ కి జరమే కదా నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావ్ అని అభిషేక్ అంటాడు. మా నాన్నకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అని స్వర బాధపడుతుంది. ఆయన జ్వరంతో బాధపడుతుంటే నేనెలా చదువుకోగలను సార్ అని స్వర అంటుంది. స్వర జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి ఇలాంటి కష్టం ఎదుర్కొనే ధైర్యంగా నిలబడాలి అంతేకానీ లక్ష్యాన్ని చేరుకునే ఆటుపోటకి ప్రయాణాన్ని ఆపేస్తామా నువ్వు మాట్లాడడానికి కూడా భయపడేదాన్ని అన్నింటిని అధిగమించావు ఇప్పుడు నీ లక్ష్యానికి చేరుకోవాల్సిన సమయం ఎగ్జామ్స్ బాగా రాస్తే నీ లక్ష్యానికి చేరుకున్నట్టే సమస్యలను ఎదుర్కోవాలి కానీ ఓటమి ని అంగీకరించకూడదు అని అభిషేక్ అంటాడు. ఈ పరిస్థితుల్లో నాకు ఏది ముఖ్యం కాదు మా నాన్నకు జ్వరం తగ్గేంత వరకు నేను చదవలేను అని స్వర అంటుంది.
ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం నేను లా చదువచ్చు కదా సార్ కానీ మా నాన్నకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను సార్ ఆయన తప్ప నాకు ఎవరూ లేరు అని స్వర బాధపడుతుంది. మొండితనమే అనుకోండి పిచ్చి అనుకోండి ఆయన కోసం నేను ప్రాణమైన వదులుకోడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని స్వర అంటుంది. కేవలం నా కారణంగా అటు అభికి ఇటు చదివికి దూరం కావడం నాకు ఇష్టం లేదు నేను ఏదో ఒకటి చేయాలి అని నాయుడు అనుకుంటాడు.ఇప్పుడు బాధలో తీసుకున్న నిర్ణయం వల్ల తన జీవితం పాడవుతుంది నన్ను తిట్టుకున్న పర్వాలేదు తనే అర్థం చేసుకుంటుంది అని అభిషేక్ తీసుకువచ్చి చదువుకోమని చెబుతాడు.
దిక్కులు చూడకుండా చదువుకో సార్ ని నేను చూసుకుంటాను అని అభిషేక్ అంటాడు. అభిషేక్ నైట్ అంతా అక్కడే ఉండి నాయుడుకి సేవలు చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే, ఎందుకు బంగారం అంత టెన్షన్ పడుతున్నావ్ అని రవీంద్ర అంటాడు. మనం వైజయంతికి సపోర్ట్ చేయాలనుకున్నాను కదా మా అన్నయ్య కి ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు అన్నయ్యని ఏం చేయగలం నువ్వేమో ఏకంగా వాడి చావుకే ముహూర్తం పెట్టావు అని చందన అంటుంది. మీ అన్నయ్యని ఏం చేయలేక పోయింది కానీ ఒక మినిస్టర్ని వీల్ చైర్ లో కూర్చోబెట్టగలిగింది కదా వాళ్ళ అమ్మని చంపేసింది ఎందుకంటే ఎప్పుడు వాళ్లతోటే ఉండి వాళ్ళ వీక్ పాయింట్ అని తెలుసుకుంటారు
కదా అని రవీంద్ర అంటాడు. వైజయంతి వాళ్ళు స్వరని ఎత్తుకురడ0 ఎందుకు ఫెయిల్ అయ్యారు ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎక్కడో ఉండి స్వరని పట్టుకోలేకపోయారు స్వరకి రక్షణ కవచంలో మా అన్నయ్య ఉండి కాపాడాడు కాబట్టి ఇప్పుడు మనం ఉన్నాం కదా అని చందనం అంటుంది. మనం ఏం చేసినా ఎవరికీ తెలియకూడదు అని రవీంద్ర అంటాడు. ఇప్పటినుంచి దాని నేను అమలు పరుస్తాను అని చందన నవ్వుతుంది. కట్ చేస్తే, కళ్యాణికి వైజయంతి ఫోన్ చేస్తుంది. మీరు నాకు ఫోన్ చేశారేంటి అని కళ్యాణి అడుగుతుంది.నేను చెప్పినట్టు చేస్తే మీరువింటే మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి వస్తాయి నేను చెప్పినట్టు చెయ్యి అని వైజయంతి అంటుంది. నేను ఒక్కదాన్నే ఇవన్నీ ఎలా చేయగలను అని కళ్యాణి అంటుంది. నీకు నా తమ్ముడు బాబ్జి రంగరాజు గారు హెల్ప్ చేస్తారు అని వైజయంతి అంటుంది. నేను ఇవన్నీ చేశాక నువ్వు డబ్బులు ఇస్తావని గ్యారెంటీ ఏంటి అని కళ్యాణి అంటుంది. నీకు డబ్బు అవసరం నాకు నీ అవసరం నీ పరిస్థితి మారాలంటే నేను చెప్పినట్టు చెయ్ అని వైజయంతి అంటుంది. అలాగే వదిన అని కళ్యాణి అంటుంది. అభి స్వర ఒకే దెబ్బకి రెండు పిట్టల పని అయిపోతుంది అని వైజయంతి అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుం
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!