పోలీసులు ఎక్కడ? అని వర్మ అడిగితే.. చలానా పంపించి `ఇదిగో ఇక్కడ`… అని చెప్పారు పోలీసులు. సినిమాలు తీసుకునే వర్మకు, చలానాలు రాసే పోలీసులకు ఎక్కడ లింకు కుదిరింది? ఇదీ ఆసక్తికరమైన కథనం. రామ్గోపాల్ వర్మ శిష్యుడు, స్నేహితుడు అయిన పూరి జగన్నాథ్ తీసిన `ఇస్మార్ట్ శంకర్`ను ఇటీవల హైదరాబాద్లోని శ్రీరామ్ థియేటర్లో చూశారు వర్మ. అదీ `ఆర్.ఎక్స్.100` అజయ్ భూపతి, `లక్ష్మీస్ ఎన్టీఆర్` అగస్త్యతో కలిసి. ఈ ఇద్దరు దర్శకులు మాత్రమే కాకుండా, వర్మ కూడా అదే బైక్ మీద శ్రీరామ్ థియేటర్కు వెళ్లారు. ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోలేదు. పైగా ట్రిపుల్ రైడింగ్. వెళ్తే వెళ్లారు గుట్టు చప్పుడు కాకుండా వెళ్లారా అంటే అదీ లేదు. మేం ట్రిపుల్ రైడింగ్ వెళ్లాం.. హెల్మెట్ పెట్టుకోలేదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, పోలీసులను అందులోకి లాగారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ సీరియస్గా తీసుకుని పోలీసులకు ఫేస్బుక్ ద్వారా తెలియజేశారు. వెంటనే వారు ట్రిపుల్ రైడింగ్కు రూ.1200, హెల్మెట్ లేనందుకు 135 జరిమానా విధించారు. ఇక్కడ జలక్ ఏంటంటే వాళ్లకు విధించిన జరిమానాను ఆ ముగ్గురిలో ఏ ఒక్కరూ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీఎస్07 2552 నెంబర్ ఉన్న ఆ బండికి యజమాని బడ్డె దిలీప్కుమార్ అన్నమాట. దాంతో వర్మా.. ఇదేం ఖర్మరా బాబూ.. అని అనుకోవడం అతని వంతయ్యింది.
previous post
Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!