ప్రముఖ కన్నడ కమెడియన్ మిమిక్రీ రాజగోపాల్ (69)ఈరోజు కన్నుమూసినట్లు ఆయన కుటుంబం వెల్లడించింది. మిమిక్రీ రాజగోపాల్ కన్నడలో పేరుమోసిన కమెడియన్. ఈరోజు బెంగళూరులోని తన స్వస్థలంలో కన్నుమూసినట్లు తెలుస్తోంది.
దాదాపు 650 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను విశేషంగా అలరించారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో రాజగోపాల్ ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. రాజగోపాల్ కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేవలం సినిమాలతోనే కాకుండా సీరియళ్లతో కూడా రాజగోపాల్ ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ప్రముఖ స్టార్లను, రాజకీయ నాయకులను రాజగోపాల్ మిమిక్రీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. లాక్ డౌన్ లో ఇటీవలే కన్నడ నటుడు చిరంజీవి సర్జాను కోల్పోయిన కన్నడ ఇండస్ట్రీ, ఈరోజు మరో తారను కోల్పోవడం ఇండస్ట్రీకి తీరని లోటు.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!