RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ చరణ్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య ఎతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్గా, చరణ్ అల్లూరి సీతరామరాజుగా అలరించబోతున్నారు.
వీరి సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఎప్పుడూ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. మేకర్స్ విసృతంగా ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. కానీ, కరోనా కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం మార్చి 25న రిలీజ్ కాబోతోంది. దీంతో చిత్ర టీమ్ మళ్లీ ప్రమోషన్స్ షురూ చేశారు.
ఇందులో భాగంగా ఎన్టీఆర్, చరణ్లతో కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. సినిమా గురించి ఎన్నో విషయాలు మాట్లాడారు. తారక్, చరణ్లను ఈ సినిమా కోసం ఎంపిక చేయడానికి కారణం వారికున్న స్టార్డమ్, టాలెంట్ మరియు వ్యక్తిత్వం. అలాగే ను రాసుకున్న కథలో కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలకు వాళ్లు మాత్రమే న్యాయం చేయగలదు. అందుకే వారిద్దరినీ ఎంచుకున్నా అంటూ రాజమూళి చెప్పుకొచ్చారు.
ఇక ఈ సందర్భంగా ఎన్టీఆర్, చరణ్ల స్నేహంపై ఆయన ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచే చెర్రీ, తారక్ల మధ్య స్నేహం ఏర్పడింది అన్నది అబద్దం. నిజానికి వాళ్లు ఎప్పటి నుంచో మంచి స్నేహితులు. అది ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడీయన కామెంట్స్ వైరల్గా మారాయి.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!