టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. పదేళ్ల తర్వాత ఆయన సినీ రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన స్థానం చెక్కు చెదరలేదంటే.. ఆయనకున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవాలి. రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150తో తన సత్తా చాటారు. అలాగే సైరా నరసింహారెడ్డి వంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రామ్చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా రూపొందనున్న చిత్రమిది. రీసెంట్గా కోకా పేటలో భారీ సెట్లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమా చెన్నై బ్యూటీ త్రిష హీరోయిన్గా నటించనుంది. అయితే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. అందులో నటించమని చిత్ర యూనిట్ రెజీనాను సంప్రదించారట. అయితే హీరోయిన్ క్యారెక్టర్తో పాటు నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలను చేస్తున్న రెజీనా స్పెషల్ సాంగ్ చేయనని సింపుల్గా చెప్పేసిందట. ఇప్పుడు మెగా క్యాంప్ మరో స్పెషల్ భామ కోసం వెతుకుతుందట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!