Renu Desai: మాస్ మహారాజ రవితేజ నటించిన “టైగర్ నాగేశ్వరరావు” సినిమాలు లవణం పాత్రలో రేణు దేశాయ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర తనని ఎంతగానో ప్రభావితం చేసిందని రేణు చాలా ఇంటర్వ్యూలలో తెలియజేయడం జరిగింది. దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ రేణు దేశాయ్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడం జరిగింది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రస్తుతం థియేటర్ లో రన్ అవుతూ ఉంది. ఈ క్రమంలో రేణు దేశాయ్ వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంటర్వ్యూలలో తన కెరియర్ ఇంకా వ్యక్తిగత జీవితంతో పాటు సినిమా విశేషాలు తెలియజేస్తున్నారు.
ఇదే సమయంలో మాజీ భర్త పవన్ కళ్యాణ్ పై కూడా ప్రశ్నలు యాంకర్లు అడుగుతూ ఉండటంతో రేణుదేశాయ్ చాలా తెలివైన సమాధానాలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్లపై వచ్చే నెగిటివ్ కామెంట్లపై సీరియస్ వ్యక్తం చేశారు. అమ్మాయి లుక్ లేదా యాక్టింగ్ పై కామెంట్లు చేయొచ్చు కానీ ఆమె క్యారెక్టర్ ని దెబ్బతీసేలా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఆమె ఎంత మందితో పడుకుంది అని మాట్లాడుతూ ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రకంగా మాట్లాడుకునే ధోరణి మానుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ పై రాజకీయ విమర్శలు చేసిన ఆయన మేనిఫెస్టోను విమర్శించిన తనకు ఇబ్బంది ఏమీ లేదని.. కానీ ప్రతిసారి తనను తన పిల్లలను లాగటం ఏమిటని విమర్శలు చేయడం జరిగింది. ఇటీవల తమ ని టార్గెట్ చేయడం మరీ ఎక్కువైపోతుందని వీటికి ముగింపు పలకాలని కోరుతున్నట్లు రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. వ్యక్తిగత విషయాలతోపాటు పిల్లలపై అనవసరంగా విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!