యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `సాహో`. యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్గా విడుదలైంది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. నాలుగు భాషల్లో విడుదలై ఈ ట్రైలర్ ,48 గంటల్లోనే 70 మిలియన్ వ్యూస్ను రాబట్టుకుంది. మరి ట్రైలర్ 100 మిలియన్ మార్క్ను చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టేలా లేదు.
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీగా విడుదల కానుంది. సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్ రెట్టింపు చేసింది. ఈ సినిమాను రూ.350కోట్లతో తెరకెక్కించారు.