టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఎలాంటి పాత్ర అయినా చేయగలిగే వారిలో సమంత ఒకరు. తన చేతికి వచ్చిన ప్రతి పాత్రలో ఇట్టే ఒదిగిపోతారు. ముఖ్యంగా “రంగస్థలం” సినిమా లో రామలక్ష్మి పాత్రకు సమంత పెర్ఫార్మెన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సమంత నటించిన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. పరిస్థితి ఇలా ఉండగా సమంత తాజాగా మరొక సరికొత్త క్యారెక్టర్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
నాగ చైతన్య తో పెళ్లి అయిన తర్వాత చాలావరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ రాణిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఒక థ్రిల్లర్ జోనర్ లో సమంత ఫస్ట్ టైం మూగ పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ అశ్విన్ శర్వానన్ తెరకెక్కించబోతున్నారట. సమంత ఈ సినిమాలో మూగ అమ్మాయి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ కొత్త క్యారెక్టర్ హాట్ టాపిక్ అయింది. తెలుగు, తమిళంలో ఈ సినిమా రిలీజ్ కానుందట.
ఇదే టైపులో స్టార్ హీరోయిన్ అనుష్క “నిశ్శబ్దం” లో క్యారెక్టర్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా సమంత మూగ అమ్మాయి క్యారెక్టర్ కి ఒప్పుకోవడంతో అక్కినేని అభిమానులు కూడా ఈ సినిమా పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సౌత్ ఫిల్మ్ నగర్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సమంతా కరోనా వైరస్ కారణంగా ఇంటిలో ఉన్న త్వరలో వెబ్ సిరీస్ “ఫ్యామిలీ మాన్ సీజన్ 2” షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!