Penny Song: సూపర్ స్టార్ మహేష్ బాబు “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో నటించిన “సర్కారు వారి పాట” ఈ వేసవిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మే 12వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. వరుస పెట్టి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న మహేష్ ఈ సినిమాతో కూడా గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తాడని ఫుల్ నమ్మకంతో ఉన్నారు. పైగా ఈ ప్రాజెక్టు ఓకే చేసిన సమయంలోనే సోషల్ మీడియాలో మరో బ్లాక్ బస్టర్ కి నాంది అని చెప్పటం మాత్రమే కాక “సర్కారు వారి పాట” తన కెరీర్లో మరో పోకిరీ అని చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదటి సాంగ్ “కళావతి” సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. దేశంలో మాత్రమే కాక విదేశాలలో సైతం దాదాపు కొన్ని రోజులపాటు నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ గా నిలిచింది. ఇదే సమయంలో నిన్న రెండో సాంగ్ రిలీజ్ కావడం తెలిసిందే. “పెన్నీ” అనే సాంగ్ సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సాంగ్ కూడా కళావతి మాదిరిగానే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది.
సోషల్ మీడియా లో రిలీజ్ అయిన నాటి నుండి ట్రెండింగ్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచి అత్యంత వేగంగా 15 మిలియన్ వ్యూస్ అందుకునే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. పైగా పాటలు మహేష్ బాబుతో పాటు కూతురు సితార కూడా స్టెప్పులు వేయడంతో… మహేష్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సితారా లో మంచి ఎనర్జీ ఉందని ఫుల్ జోష్ లో ఆడిపాడుతున్నట్లూ… గౌతమ్ కంటే సితార చాలా ఎనర్జిటిక్ గా అంటూ… పాపపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!