కరోనా వైరస్ దేశంలో సృష్టిస్తున్న విధ్వంసం తెలిసిందే. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల వరకూ అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. రీసెంట్ గా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తోపాటు తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా కోవిడ్ బారిన పడటం దేశంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే బాలీవుడ్ లో మరో లెజండరీ నటి రేఖ కూడా పరోక్షంగా ఈ కరోనా ఎపెక్ట్ కు గురయ్యారు.
బాంద్రాలోని బండ్ స్టాండ్ ఏరియాలో ఉన్న రేఖ బంగ్లా సీ స్ప్రింగ్స్ కు బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ వేశారు. రేఖ ఇంటి సెక్యూరిటీ గార్డ్ కు కరోనా వైరస్ సోకడంతో ఈ బంగ్లాకు సీల్ వేశారు. రేఖ ఇంటికి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉండగా వారిలో ఒకరికి కరోనా సోకింది. బాంద్రాలోని కుర్లా కాంప్లెక్స్ లో అతనికి వైద్యం అందిస్తున్నారు. రేఖ ఇంటి ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈమేరకు ఓ నోటీస్ ను కూడా ఇంటి బయట అంటించారు. రేఖ ఇంటి పరిసరాలను శానిటైజ్ చేశారు మున్సిపల్ అధికారులు.
దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎన్నో జాగ్రత్తలు, ఆహార కఠిన ఆహార నియమాలు పాటించే ప్రముఖులు కూడా కోవిడ్ బారిన పడటం చర్చనీయాంశమవుతోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!