ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి అనౌన్స్ మెంట్ మొదలైనప్పటి నుంచీ ప్రతిదీ ఆసక్తికరమే. నందమూరి, కొణిదెల వారసులు నటిస్తున్న ఈ సినిమాకు జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. హీరో హీరోయిన్లు అందరూ కుదిరారు అనుకుంటున్న సమయంలో డైసీ ఎడ్గర్ జోన్స్ సారీ చెప్పి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. వెంటనే ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్ భామలు శ్రద్ధాదాస్, పరిణితీ చోప్రాను వెతుక్కుంటూ వెళ్లింది. చేతిలో కాల్షీట్ ఖాళీలేక శ్రద్ధాదాస్ అప్పటికే ట్రైనింగ్ కూడా తీసుకున్న సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచే బయటికి వచ్చేసింది. ఈ విషయాన్నే రాజమౌళికి చెప్పి సారీ అని అనేసిందట. ఆ తర్వాత రాజమౌళి పరిణితీ చోప్రాను అప్రోచ్ అయ్యారు. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. `సైనా నెహ్వాల్ బయోపిక్ లో ఏముందో ఏమోగానీ, ఇంతకు ముందు ఆ ప్రాజెక్ట్ను అంగీకరించిన శ్రద్ధాకు డెంగ్యూ వచ్చింది, ఇటీవల నాక్కూడా డెంగ్యూ వచ్చింది.. అయినా కమిట్ అయిన ప్రాజెక్ట్ ను వద్దని చెప్పి, కొత్త ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయితే నా క్రెడిబిలిటీ ఏముంటుంది? అందుకే నేను సైనా నెహ్వాల్ బయోపిక్ మీద ప్రస్తుతం ఫోకస్ చేస్తాను. మీ దర్శకత్వంలో తర్వాత తప్పక చేద్దాం` అని చెప్పి సున్నితంగా తప్పించుకుందట.
సో ఇప్పుడు ఈ ఇరువురు భామలు సారీ చెప్పేయడంతో, ఆ పాత్రకు నివేదా థామస్ అయితే సరిపోతుందని, ఆమెను ట్రై చేద్దామని, భాషతో పాటు ఇలాంటి సమస్యలు ఉండవనీ ఎన్టీఆర్ సూచించినట్టు సమాచారం. చూద్దాం.. ఆ పాత్రకు ఇంటర్నేషన్ స్థాయి నుంచి ఏ వైపుకు మళ్లుతుందో.. ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో.