సినిమాకు బలం కథ. ఆ కథను నడిపించే దర్శకుడికి ఎంత టాలెంట్ అవసరమో.. తాను అనుకున్న పాత్రలకు తగిన నటీనటులను ఎంచుకోవడమూ సవాలే. వారిని సినిమాలోకి తీసుకోవడమే కాదు.. వారి నుంచి అత్యత్తమ నటనను రాబట్టడం కూడా దర్శకుడి విధి. అటువంటి నటీనటులతోనే తెరకెక్కుతూ.. ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి రేపుతున్న సినిమా ‘విరాటపర్వం’. ఈ సినిమా ప్రారంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. కారణం.. ఈ సినిమాలో కీలకపాత్రల్లో దగ్గుబాటి రానా, ప్రియమణి, సాయి పల్లవి, నందితా దాస్.. వంటి నటులు నటించడమే. ఇప్పుడు వీరితో మరె టాలెంటెడ్ నటి చేరబోతోంది.
తెలుగు, తమిళ భాషల్లో టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకుంటున్న హీరోయిన్ నివేధా పేతురాజ్. చిత్రలహరి, బ్రోచేవారెవరురా.. వంటి విభిన్నమైన సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న నటి నివేధా పేతురాజ్. విరాటపర్వంలో ఆమె ఓ కీలకపాత్ర పోషించబోతోంది. సినిమాలో ముఖ్యమైన పాత్రకు నివేధా పేతురాజ్ సరిపోతుందని భావించిన దర్శకుడు ఆమెకు కథ వినిపించాడని తెలుస్తోంది. కథ, తన పాత్ర నచ్చిన నివేధా ఇప్పటికే హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంది కూడా. దీంతో ఈ సినిమాకు అదనపు ఆకర్షణ, కథ, సినిమాపై మరింత ఆసక్తి నెలకొందని చెప్పాలి. లాక్ డౌన్ కు మునుపే వికారాబాద్ అడవుల్లో మేజర్ పార్ట్ షూటింగ్ జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో షెడ్యూల్ జరుగుతోంది.
నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రానా, ప్రియమణి, సాయిపల్లవిపై రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. సినిమాలో వీరు ఉద్యమకారులుగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రియమణి, నందితాదాస్, జరీనా వహాబ్.. వంటి జాతీయస్థాయి అవార్డులు అందుకున్న నటీమణులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమాకు వేణు ఊడుగుల దర్వకత్వం వహిస్తున్నారు. వేణఉ ఊడుగుల గతంలో ‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమా తెరకెక్కించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇదే. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!