Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో అడుగు పెట్టాక తలరాత మారిపోయింది. 2016లో “కిరిక్ పార్టీ” అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2018వ సంవత్సరంలో కుర్ర హీరో నాగశౌర్య నటించిన “ఛలో” సినిమాతో… తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకోవడం జరిగింది. “ఛలో” సినిమాలో రష్మిక మందన నటన అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. దర్శకుడు వెంకీ కుడుముల.. అద్భుతంగా చూపించారు.
ఈ సినిమా నాగశౌర్య కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ అయింది. ఇక ఆ తర్వాత పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో రష్మిక మందన నటించిన “గీత గోవిందం” అతిపెద్ద రొమాంటిక్ బ్లాక్ బస్టర్ హీట్ అయింది. అప్పటికే విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ సమయంలో “గీతా గోవిందం” వంటి ప్రేమకథా నేపథ్యం కలిగిన సినిమా పడటంతో ఈ సినిమా.. యువతను ఎంతగానో ఆకట్టుకుంది. హీరోయిన్ గా రష్మిక మందనాకి ఈ సినిమా బాగా ప్లస్ అయ్యింది. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సరిలేరు నీకెవరు” లాంటి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో “పుష్ప” సినిమా చేసి పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించి నేషనల్ క్రష్ గా టాక్ ఆఫ్ ది టౌన్ గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సత్తా చాటుతూ ఉంది. ఇక రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో “యానిమల్” సినిమాతో మరో అతి పెద్ద పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకోవటం జరిగింది.
డిసెంబర్ మొదటి తారీకు విడుదలైన “యానిమల్” అన్ని భాషలలో సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రస్తుతం వరుస విజయాలతో రష్మిక మందన దూసుకుపోతోంది. అయితే రష్మిక మందన ఇండస్ట్రీకి వచ్చి డిసెంబర్ 30 ఏడేళ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆమె నటించిన మొదటి సినిమా “కిరిక్ పార్టీ” విడుదల అయ్యి నేటికి ఏడేళ్లు కావడంతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. ఏడేళ్లు పూర్తి చేసుకోవడంతో ఆమెకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ట్విట్టర్ లో నేషనల్ క్రష్ మిక అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో తనపై అభిమానులు చూపుతున్న ప్రేమకు రష్మిక ఫుల్ ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ హీరోయిన్ పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్, చావా సినిమాలలో నటిస్తూ ఉంది.