నిర్మాతల మండలి నిర్మాతల మేలు కోరి ఓ బేషైన నిర్ణయం తీసుకుంది. ఇంతకు అంత మంచి నిర్ణయం ఏంటి? అని అనుకుంటున్నారా!.. వివరాల్లోకెళ్తే.. నిర్మాతలకు డిజిటల్ ఫ్లాట్ఫాం ఓ వరంగా మారింది. భారీ మొత్తంలో నిర్మాతలకు డిజిటల్ మీడియా సంస్థలు డబ్బులు ఇచ్చి వారి ఫ్లాట్ఫామ్స్లో సినిమాలను ప్రదర్శించుకోడానికి అనుమతులను పొందుతున్నాయి. అయితే ఇక్కడొక చిక్కొచ్చి పడింది. అదేంటంటే.. సినిమా థియేటర్స్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నా సరే!..డిజిటల్ మాధ్యమాల్లో ప్రసారం అయిపోతున్నాయి. దీని వల్ల థియేటర్కు రావాలనుకునే ప్రేక్షకులు మూడు, నాలుగు వారాలు ఆగితే డిజిటల్ ఫ్లాట్ఫాంలో సినిమా చూసేయవచ్చు అనే ఆలోచనలకు వచ్చేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలకు ఇది చిన్న నష్టాన్ని కలిగించినా.. మీడియం, చిన్న బడ్జెట్ మూవీ చిత్రాలనిర్మాతల, డిస్ట్రిబ్యూటర్స్కు పెద్ద నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ సమస్యకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ పరిష్కారాన్ని సూచించింది. ఇక నిర్మాతలందరూ వారి సినిమాలను విడుదలైన 8 వారాల తర్వాతనే డిజిటల్ మీడియంలో ప్రదర్శించాలని కండీషన్తోనే హక్కులను అమ్మాలని సూచించింది. మరి ఈ నిర్ణయంపై డిజిటల్ సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి…
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!