Sai Pallavi: భారతీయ చలనచిత్ర రంగంలో రామాయణం ఇతిహాసం ఆధారంగా చాలా సినిమాలు ఇప్పటి వరకు రావడం తెలిసిందే. మొన్ననే “ఆది పురుష్” విడుదలయ్యింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కటం జరిగింది. రాముడి పాత్రలో ప్రభాస్ నటించిన సీత పాత్రలో కృతి సన్నాన్ నటించడం జరిగింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన “ఆది పురుష్” బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణం ఇతిహాసం ఆధారంగా హిందీలో ఓ సినిమా తెరకకబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నట్లు సీత పాత్రలో ఆలియా భట్ మొదటిలో అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఇప్పుడు సీత పాత్రలో ఆలియా భట్ తప్పుకున్నట్లు ఆమె స్థానంలోకి సాయి పల్లవిని సెలెక్ట్ చేసినట్లు సరికొత్త టాక్ నడుస్తుంది. బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు హాలీవుడ్ సినిమాలు వరుసగా చేస్తూ ఉండటంతో ఆలియా భట్.. ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో మేకర్స్ సాయి పల్లవి తో చర్చలు జరిపి ఆమె నుండి పాజిటివ్ స్పందన రావడంతో త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. సాయి పల్లవి మొదటి నుండి చాలా ఒద్దికమైన పాత్రలు.. చేసే హీరోయిన్ అని అందరికీ తెలుసు. సీత పాత్ర అదే తరహా కావటంతో సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
తమిళ ఇండస్ట్రీకి చెందిన సాయి పల్లవి “ప్రేమమ్” సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “ఫిదా” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమా తోనే భారీ హీట్ అందుకోవడం జరిగింది. ఆ తర్వాత వరుస పెట్టి అవకాశాలు అందుకుని తెలుగులో టాప్ హీరోయిన్ స్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పాన్ ఇండియా నేపథ్యంలో నితీష్ తివారి తీయబోతున్న “రామాయణం”లో సీత పాత్రలో ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!