టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి రెండో సారి నియమితులైన తర్వాత ఆయనపై అనేక రకాలుగా ఆరోపణలు, విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. భూమన నాస్తికుడనీ, క్రిస్టియన్ అని, ఆయన కుమార్తె వివాహాన్ని క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేశారని ఇటా ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. తనపై వస్తున్న ఆరోపణలపై భూమన తొలి సారిగా స్పందించారు. తాను విమర్శలకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేస్తూ విమర్శకులకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
తాను నాస్తికుడిని అని విమర్శించే వారికి ఇదే సమాధానం అంటూ 17 ఏళ్ల క్రితమే తాను టీటీడీ చైర్మన్ అయ్యానని చెప్పారు. 30వేల మందికి కళ్యాణ మస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించాననీ, తిరుమల ఆలయ మాడవీధుల్లో చెప్పులతో వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నది తానేనని చెప్పారు. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సావలు జరిపించింది కూడా తానేనన్నారు. దళిత వాడల్లో శ్రీవెంకటేశ్వరస్వామి కళ్యాణం చేయించింది తానేనని గుర్తు చేశారు.
తాను క్రిస్టియన్ అని, నాస్తికుడిని అని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే తమ సమాధానం అని పేర్కొన్నారు. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపేవాడిని కాదని అన్నారు. పోరాటాల నుండి పైకి వచ్చిన వ్యక్తిననీ, ఇలాంటి వాటికి భయపడనని భూమన పేర్కొన్నారు. ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాసాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీటీడీ నాలుగు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనపై నెల రోజుల్లో ప్రదర్శ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
BJP: నేడు ఖమ్మంలో రైతు గోస – బీజేపీ భరోసా సభ .. అమిత్ షా సమక్షంలో జరిగే చేరికలపై ఉత్కంఠ