Trinayani February 20 2024 Episode 1168: నాగయ్య రాకపోయి ఉంటే సుమన కోపంలో నిన్ను ఎక్కడ పడేసేదో అని తలుచుకుంటేనే గుండెకు బాదేస్తుంది గాయత్రి అని నైని బాధపడుతుంది. తనకేమీ కాదు అని విశాల్ అంటాడు. గాయత్రి మీదనే అందరి కళ్ళు ఇంకెక్కడైనా ఆనందంగా ఉంటుందేమో ఆలోచించండి బాబు గారు అని నైని అంటుంది. నువ్వు అలా మాట్లాడకు నైని అని విశాల్ అంటాడు. తిలోత్తమ అత్తయ్య సుమన గాయత్రిని ఏం చేస్తారో అని భయంగా ఉంది బాబు గారు అని నైని అంటుంది. నైని నాగయ్యే అంత జాగ్రత్త తీసుకుంటున్నాడు అంటే పాప గురించి మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి అని విశాల్ అంటాడు. ఆస్తి పాప పేరుతో ఉందని సుమన అనాధ పిల్ల ఇంట్లో ఉందని తిలోత్తమ అత్తయ్య వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని నైని అంటుంది.
తనకేం కాదులే నేను చూసుకుంటాను అని విశాల్ అంటాడు. ఎందుకు తన మీద అంత ప్రేమను పెంచుకున్నారు అని నైని అడుగుతుంది. ఎందుకంటే మా అమ్మ కాబట్టి తనే మా అమ్మ రూపంలో ఇంటికి వచ్చిందని భావిస్తున్నాను ఇంకెప్పుడు పాపని విడిచిపెడదామని అనకు ప్లీజ్ నా ప్రాణం ఉన్నంతవరకు ఇక్కడే ఉంటుంది అంటూ విశాల్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, సుమన టాబ్లెట్ వేసుకో అని విక్రాంత్ అంటాడు. నేను పేషెంట్ ని కానీ మీ నైని వదినను ఎందుకు అడగట్లేదు ఇలా ఎందుకు చేసావు అని సుమన అంటుంది. నీకు పిచ్చి పట్టింది అని విక్రాంత్ అంటాడు. నేను మీ అందరి ముందు తన నిజ స్వరూపం బయట పెడతాను అని సుమన అంటుంది. ఆల్రెడీ చేశావు కదా యూట్యూబ్ లలో మెసేజ్లు పెడుతున్నారు అని విక్రాంత్ అంటాడు. మా అక్క చంపాలని చూసిన ఇంకా బ్రతికే ఉండాలని వచ్చాను అని సుమన అంటుంది. వదిన ప్రాణాల్ని కాపాడుతుంది కానీ తీసేది కాదు అని విక్రాంత్ అంటాడు.
ఉలోచి పాప కోసం బ్రతికి వచ్చాను అని సుమన అంటుంది. అందుకే ఇంకా బ్రతికే ఉన్నావు లేదంటే నా చేతిలోనే చచ్చేదానివి అంటూ విక్రాంత్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, ఎద్దులయ్య డమ్మక్క ఇంటికి వస్తారు.విశాలాక్షి పాప మీద నింద పడకూడదని వెళ్ళిన వారు మళ్లీ ఎందుకు వచ్చారు అని తిలోత్తమ అంటుంది. ఇంతలో గురువుగారు అక్కడికి వస్తారు. అందరూ నమస్కారం పెడతారు. ఎవరు ఎవరి ప్రాణాలు తీయాలనుకున్నారు సుమన అని గురువుగారు అంటారు. ఇంకెవరు ఆ విశాలాక్షి గురువుగారు అని సుమన అంటుంది. నీకెలా తెలుసు సుమన అని గురువుగారు అంటారు.నాకు తెలియకుండా ఎలా ఉంది గురువుగారు అని నైని అంటుంది. విశాలాక్షి నీకు నిజం తెలియకుండా చేసింది అని గురువుగారు అంటారు. అంటే చిట్టి ప్రాణాలు పోవాలనుకుందా విశాలాక్షి అని హాసిని అంటుంది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అంటే ఇదేనేమో అని ఎద్దులయ్య అంటాడు. ఎద్దులయ్య ఏంటి గొడవ మనకెందుకు ఊరుకో అని డమ్మక్క అంటుంది.
విశాలాక్షి పేరు చెప్పి మా అక్కను తప్పించాలనుకుంటున్నారా గురువుగారు నాకు అన్యాయం జరిగింది నేనెవరికీ చెప్పుకోవాలి అని సుమన అంటుది. విశాలాక్షిని అందుకే పంపించావా నైని అని గురువుగారు అంటారు. విశాలాక్షి మీద నింద వేస్తారని పంపించాను గురువుగారు అని నైని అంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు పాలలో విషం కలిపారు అని గురువుగారు అంటారు. మేము ఎవరం కాదు అని అంటారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు విషం కలిపారు అని అంటాడు.ఎవరు చెప్పండి అని విశాల్ అంటాడు. నేరుగా చెప్పడం ఇష్టం లేక పరోక్షంగా చెబుతున్నారు ఆ ఒక్కరు ఎవరై ఉంటారు అని తిలోత్తమ అంటుంది. నాకు తెలుసు అని హాసిని అంటుంది. ఎవరో చెప్పు హాసిని అని దురంధర అంటుంది. చెప్తే ఏమిస్తారు అని హాసిని అంటుంది. ఎవరు కలిపారో చెప్పు అని పావన మూర్తి అంటాడు. ఇది తల తోక లేకుండా మాట్లాడుతుంది అని తిలోత్తమ అంటుంది. తల తోక అంటే ఉలోచికే ఉంది విషం కలిపింది అంటే అదే అర్థం ఏమో అని హాసిని అంటుంది.
తను రాత్రి పాము పిల్లగా మారినప్పుడు కూడా చేసి ఉండదు కదా అని విక్రాంత్ అంటాడు. ఆ పాలు తల్లి తాగుతుందని తెలిసి ఎక్కడైనా కూతురే విషం కలుపుతుందా బాబు అని డమ్మక్క అంటుంది. అంటే సుమన పాలు తాగుతుందని ఉలోచికి తెలుసా అని పావన మూర్తి అంటాడు. తను సుమన పాలు తాగుతుందని తెలిసినా చెప్పకుండా ఎలా ఊరుకుంటుంది ఆలోచించండి అని ఎద్దులయ్య అంటాడు. నాకు తెలుసు అని హాసిని అంటుంది.ఏమై ఉంటుందో త్వరగా చెప్పు అక్క అని నైని అంటుంది. మనసు నిండా విషం నింపుకున్న వాళ్లే విషం కలిపి ఉంటారు అని హాసిని అంటుంది. హాసిని దగ్గరికి వచ్చింది అని గురువుగారు అంటారు. వాళ్ళు ఎవరో మీరే చెప్పాలి అని నైని అంటుంది. చెప్పమంటావా సుమన అని గురువుగారు అడుగుతారు. సుమన టెన్షన్ పడుతూ ఉంటుంది. సుమన భయపడుతుంది అని ఎద్దులయ్య అంటాడు. ఎందుకు భయం ఎవరో తెలిస్తే ఇంకెప్పుడు అలా జరగకుండా మందులు ఇస్తాం అని దురంధర అంటుంది. నేనే విషం కలిపానని గురువుగారు చెప్తే నన్ను చంపేస్తారు ఇప్పుడేం చేయడం అని సుమన టెన్షన్ పడుతూ ఉంటుంది.
గురువుగారు త్వరగా చెప్పండి నేను వాళ్ళని తన్ని తరిమేయాలి అని పావనమూర్తి అంటాడు. చెప్పమంటావా సుమన అని గురువుగారు అంటారు. అక్కర్లేదు స్వామి అని సుమన అంటుంది.ఆ దోషి ఎవరో తెలుసుకోవాలని నువ్వు అనుకోక పోయినా మేము అనుకుంటున్నాము నువ్వు నింద వేసింది చెల్లి నైని మీద నేను ఊరుకోను గురువుగారు మీరు ఆ దొషి ఎవరో చెప్పాల్సిందే అని హాసిని అంటుంది. చెబితే మళ్ళీ మంటలు అంటుకుంటే అని ఎద్దులయ్య అంటాడు. వాళ్ళని కొట్టడం కాదయ్య ఏకంగా చంపేస్తాను నాకు అసలే తిక్క అని హాసిని అంటుంది. గురువుగారు వీళ్ళ ముచ్చట ఎందుకు కాదనాలి చెప్పండి అని డమ్మక్క అంటుంది. అలాగే డమ్మక్క అని గురువుగారు అంటారు. గురువుగారు ఇప్పటికే అందరూ బాధపడుతున్నారు ఇక వాళ్ళు ఎవరో చెప్పి అందరి మనసులు బాధ పెట్టకండి అని సుమన అంటుంది. నువ్వెందుకు అలా అంటున్నావ్ అని విక్రాంత్ అంటాడు. సుమన ఉద్దేశం కూడా మంచిదే కదరా అందర్నీ బాధ పెట్టడం ఎందుకు అని విశాల్ అంటాడు. నన్ను నిందించిన మా చెల్లి నిజం చెప్తానని గురువుగారు అంటే కంగారుపడుతూ ఎందుకు వద్దంటుంది బాబు గారు అని నైని అడుగుతుంది.అందరికీ నిజం తెలిస్తే జరిగే మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది కాబట్టి అని తిలోత్తమ అంటుంది.