Operation Valentine: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా “ఆపరేషన్ వాలెంటైన్”. మార్చి ఒకటో తారీకు ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రీనైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించడం జరిగింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలలో సినిమా యూనిట్ బిజీబిజీగా గడుపుతుంది. ఈ క్రమంలో వరుణ్ తేజ్ సినిమా గురించి విలేకరులతో మాట్లాడుతూ కీలక విషయాలు తెలియజేశారు. 2020లో “ఆపరేషన్ వాలెంటైన్” స్టోరీతో డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ తనని సంప్రదించినట్లు తెలిపారు. ఈ సినిమా స్టోరీ చాలా బాగా నచ్చింది. గతంలోనే సోనీ పిక్చర్స్ తో సినిమా చేయాలి.
కానీ ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అయితే ఈ స్టోరీ వారికి పంపించినప్పుడు వారికి నచ్చింది వాళ్లు కూడా అన్ని వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీస్తున్నారు. నేషనల్ ఆపిల్ ఉన్న కంటెంట్ కావడంతో.. చాలా గ్రాండ్ బడ్జెట్ తో పక్కాగా ప్లాన్ చేసి సినిమాని నిర్మించారు. దర్శకుడు హిందీ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈ సినిమాలో ప్రతి సన్నివేశం తెలుగు హిందీ రెండు భాషల్లో షూట్ చేయడం జరిగింది. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ లో మంచి పాషన్ ఉంది. ఏదో ఒక సినిమా చేసేయాలని ఆలోచన తనలో లేదు. ప్రత్యేకంగా ఈ కథ ద్వారా.. ఒక సందేశం ఇవ్వాలని భావించారు దానికి నన్ను ఎంచుకున్నారు. అంతకుముందు తాను చేసిన షార్ట్ ఫిలిమ్స్ చాలా వైరల్ అయ్యాయి.
ఎయిర్ ఫోర్స్ అధికారులు అది చూసి ఆశ్చర్యపోయారు. దీనిపై సినిమా చేయాలనుకున్నప్పుడు ఇంకా కావాల్సిన సమాచారం ఇస్తామని అన్నారు. ఇక ఇదే సమయంలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కోసం తన పెళ్లి తేదీని మార్చుకున్నట్లు వరుణ్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం నిజమైన ఎయిర్ బేస్ కి వెళ్ళి షూటింగ్ చేసినట్లు వెల్లడించారు. ఎయిర్ బేస్ లో ఫోన్ లకు అనుమతి లేదు. ఉదయం 8 లోపు మూవీ యూనిట్ అంతా వెళ్లాలి. అలా 40 రోజులు షూట్ చేయడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ అధికారులు చేసిన ఆపరేషన్ గురించి వింటూ స్ఫూర్తి పొందే వాడిని. ఈ మూవీ కోసం నా పెళ్లి ముహూర్తాన్ని మార్చుకున్నా. షూటింగ్ కంప్లీట్ అయ్యాక వివాహం చేసుకున్నా.. అని వరుణ్ తేజ్ తెలియజేశారు.