Chiranjeevi: ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదికి పైగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఫైనల్ దశలో ఉంది. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మెగా హీరో రామ్ చరణ్ తేజ్ అరగంటపాటు నటించడమే కాక సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి “లూసిఫర్” సినిమా తెలుగులో రీమేక్ చేస్తూ ఉన్నారు.
అయితే ఈ సినిమాలో చిరంజీవి తో పాటు ఒక కీలక క్యారెక్టర్ లో మరో మెగాహీరో నటించనున్నారట. మోహన్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కి సంబంధించి అన్ని పనులు పూర్తికాక క్యాస్టింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించనున్నట్లు ఆమెను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే విదేశాల నుండి ఇండియాకి వచ్చి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసే పాత్రలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించనున్నారట. ఇప్పటికే ఈ పాత్ర గురించి వరుణ్ తేజ్ కి చెప్పడం జరిగిందని ఆయన ఓకే అన్నట్లు ఫిలిం వర్గాలలో టాక్. ఈ సినిమాని కూడా రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్, బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయనున్నారు. త్వరలోనే వరుణ్ తేజ్ లూసిఫర్ సినిమాలో నటిస్తున్నట్లు వార్త అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించనున్నట్లు సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!