Operation Valentine: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా “ఆపరేషన్ వాలెంటైన్” సినిమా ట్రైలర్ రిలీజ్ కావడం జరిగింది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ సరసన మనుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా చిత్రీకరించడం జరిగింది. తెలుగు మరియు హిందీ ద్వీభాష చిత్రంగా.. తెరకెక్కింది. టీజర్ మరియు పాటలతో ఈ సినిమాపై చాలా బజ్ నెలకొని ఉంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగులో రామ్ చరణ్ హిందీలో సల్మాన్ ఖాన్ చేతుల మీదగా “ఆపరేషన్ వాలెంటైన్” సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది.
ఫైనల్ స్ట్రైక్ పేరుతో ట్రైలర్ రిలీజ్ అయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తున్నారు. ఉగ్రవాదులతో శత్రుదేశంతో పోరాడే సన్నివేశాలు గాలిలో యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్ లో చాలా అద్భుతంగా చూపించారు. ఫస్ట్ టైం వరుణ్ తేజ్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేయబోతున్నారు. ఫిబ్రవరి 14 2019 బాలా కోట్ మీద పాకిస్తాన్ చేసిన దాడుల నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరించారు.
ఈ క్రమంలో పాకిస్తాన్ మీద మన దేశ వైమానిక దళం చేసిన ఈ ఆపరేషన్ నీ.. ఆపరేషన్ వాలెంటైన్ గా తెరపైకి తీసుకొచ్చారు. ఈ సినిమా మార్చి ఒకటవ తారీకు హిందీ మరియు తెలుగు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. విడుదలైన ట్రైలర్ లో ఏం జరిగినా సరే చూసుకుందాం అనే డైలాగ్… చాలా హైలెట్ గా నిలిచింది. తెలుగులో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసిన రామ్ చరణ్ వరుణ్ తేజ్ పై ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఎప్పుడు ప్రయోగాలు చేస్తూ గర్వించేలా చేస్తుంటావు ఈసారి ఇండియా అంత గర్వపడే సినిమా చేసావ్ అంటూ చరణ్ ట్రైలర్ నీ ట్విట్టర్ లో షేర్ చేశారు.