Varun Tej: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు రకరకాలుగా కృషి చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులలో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కాకూడదని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తలు వహిస్తూ బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తూనే.. మరో పక్క తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఇంకా అనేక విషయాలపై చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఈ క్రమంలో తిరుపతి పార్లమెంటు స్థానానికి జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పోటీ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై నిహారిక అన్న వరుణ్ తేజ్ స్పందించారు. అందులో వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారం పై తమ కుటుంబంలో పెద్దల నిర్ణయం ఫైనల్ అని తేల్చి చెప్పారు. పెదనాన్న చిరంజీవి నాన్న నాగబాబు బాబాయ్ పవన్ కళ్యాణ్.. ఏం చెబితే అదే చేస్తామని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. తమ కుటుంబం అంతా బాబాయి పవన్ వెంటే ఉంటామని క్లారిటీ ఇచ్చారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా చేయడం జరిగింది.
పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1వ తారీకు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటూ నిహారిక పై వచ్చిన రాజకీయ వార్తలు గురించి వరుణ్ తేజ్ క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఈ సినిమాలో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా వరుణ్ కనిపించనున్నాడు. రెండు రోజుల క్రితం సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. పాకిస్తాన్ ఇండియాపై చేసిన దాడిని ఆధారం చేసుకుని ఈ సినిమాని చిత్రీకరించారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!