Rashmika Mandanna: కన్నడ బామ్మ రష్మిక మందన గ్రాఫ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. 2016లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగులో తీసిన “ఛలో” సినిమాతో బాగా పాపులర్ అయింది. మాతృభాష కన్నడలో ఫిలిం కెరీర్ ప్రారంభించిన గాని టాలీవుడ్ రష్మికకి లైఫ్ ఇచ్చింది. తెలుగులో “ఛలో” సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత “గీతాగోవిందం” ఇంకా అనేక హిట్ సినిమాలు అందుకుని 2021లో “పుష్ప” సినిమాతో నేషనల్ హీరోయిన్ గా అవతరించింది. “పుష్ప” సినిమాతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకోవడం జరిగింది. శ్రీవల్లి పాత్రలో ఆమె నటనతో పాటు వేసిన స్టెప్పులు మంచి పాపులారిటీని తీసుకొచ్చాయి. “పుష్ప” సినిమా విజయం తర్వాత బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అనేక అవకాశాలు అందుకుంటూ ఉంది.
ఇదిలా ఉంటే తన మొదటి సినిమా “కిరీక్ పార్టీ” చేస్తున్న సమయంలో సహనటుడు రక్షిత్ శెట్టితో పరిచయం ఏర్పడింది. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత జూలై 2017 సంవత్సరంలో నిశ్చితార్థం కూడా చేసుకోవడం జరిగింది. కానీ అనుకోని కారణాలవల్ల నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత రష్మిక కెరియర్ ఒక్కసారిగా ఉపందుకోవటం జరిగింది. ఇప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తూ ఉంది. ఇదే సమయంలో మరొక పక్క రష్మిక ఓ ప్రముఖ తెలుగు హీరోతో ప్రేమలో ఉన్నట్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి సమయంలో రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్మిక ఇంకా తనతో టచ్ లో ఉందని లేటెస్ట్ గా కామెంట్లు చేశారు. మా పెళ్లి ఆగితే ఏమిటి.. మేము ఇంకా టచ్ లోనే ఉన్నాం. ఆమెకు జీవితంలో బిగ్ డ్రీమ్ ఉండేది. ఇప్పుడు దానిని సాకారం చేసుకోవడం జరిగిందని రక్షిత్ శెట్టి వెల్లడించారు. ప్రస్తుతం రష్మిక పుష్ప సెకండ్ పార్ట్, గర్ల్ ప్రెండ్, రెయిన్ బో సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!