MP Raghurama: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుకు చెందిన కంపెనీకి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ లో బిగ్ షాక్ తగిలింది. రఘురామకు చెందిన ఇండ్ భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ దాఖలు చేసిన ఎన్సీఎల్పీ పిటిషన్ ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఇండ్ భారత్ ధర్మల్ కంపెనీ వివిధ బ్యాంకుల నుండి రూ.1383 కోట్ల రుణం తీసుకుంది. రికవరీ కోసం బ్యాంకుల కన్సార్షియం.. ఢిల్లీలోని డెబిట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. రూ.1327 కోట్ల అప్పుకు గానూ కంపెనీ తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.872 కోట్లుగా ఉందని పేర్కొన్న పంజాబ్ నేషన్ బ్యాంకు .. దివాళా అయిన కంపెనీ పరిష్కార ప్రక్రియ చేయాలని జాతీయ లా ట్రిబ్యునల్ ను కోరింది.
Read More: AP Govt: మందు బాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..! అడ్వాన్స్ న్యూ ఇయర్ గిఫ్ట్..!!
MP Raghurama: దివాలా ప్రకియకు గ్రీన్ సిగ్నల్
అయితే రఘురామ కంపెనీ దివాలా ప్రక్రియ అనుమతించవద్దని వాదించింది. దివాలా పరిష్కార ప్రక్రియ నిలుపుదల చేయాలని రఘురామ కంపెనీ ఎన్సీఎల్పీ లో వాదనలు వినిపించింది. అయితే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ రఘురామ కంపెనీ వాదనలను తోసిపుచ్చింది. దివాలా ప్రకియకు ఆమోదం ఎన్సీఎల్టీ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా దివాలా పరిష్కార నిపుణుడిని నియమించి వివరాలు తెలియజేయాలని ఎన్సీఎల్టీ ఆదేశించింది. శ్రీకాకుళం వంశీకృష్ణకు మద్యంతర పరిష్కార ప్రక్రియ పూర్తి చేసే అధికారాన్ని అప్పగించిన ఎన్ సీ ఎల్ టీ.. కంపెనీ ఆస్తులపై రఘురామకు ఎలాంటి అధికారం లేదని పేర్కొంది.
Read More: Premium Brand Liquor: బ్రేకింగ్.. మందు బాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక ఎగిరిగంతెయ్యడమే..