Mudragada Padmanabham: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన మనసు మార్చుకున్నారు. త్వరలో వైసీపీలో చేరబోతున్నారు. కొద్ది రోజుల క్రితం జనసేనలోకి వెళ్లనున్నారంటూ వార్తలు వచ్చాయి. వైసీపీ నాయకులను తన ఇంటికి రావద్దని కూడా ముద్రగడ చెప్పారని ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే జనసేన నేతలు ఆయనను కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి ఆహ్వానిస్తారని చెప్పడంతో జనసేనలో చేరికకు ఒప్పుకున్నారు.
అయితే ముద్రగడ ను పవన్ కళ్యాణ్ కలవలేదు. పవన్ కిర్లంపూడి వస్తారు.. తనను ఆహ్వానిస్తారని ముద్రగడ భావించారు. అయితే పవన్ కళ్యాణ్ రోజులు గడుస్తున్నా ముద్రగడను ఆహ్వానించే ప్రయత్నం చేయలేదు. దీంతో ముద్రగడ హర్ట్ అయ్యారు. రీసెంట్ గా ముద్రగడ రాసిన లేఖను బట్టి చూస్తేనే పవన్ కళ్యాణ్ పై కోపం వచ్చినట్లుగా స్పష్టం గా అర్ధం అవుతుంది.
ఈ పరిస్థితుల్లో ముద్రగడకు ఆప్షన్ ఇక వైసీపీనే. వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ నెల 12వ తేదీ ముద్రగడ .. వైసీపీలో చేరతారని తెలుస్తొంది. తాజాగా వైసీపీ నేత జక్కంపూడి గణేష్ ముద్రగడ నివాసానికి వెళ్లి వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు. పార్టీలో చేరిక, పోటీ చేసే అంశంపై ఇరువురు నేతలు చర్చించారు.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకే తాను పార్టీలోకి అహ్వానిస్తున్నట్లుగా మిథున్ రెడ్డి చెప్పడంతో ముద్రగడ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తొంది. వైసీపీలో చేరడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారుట. అలానే పోటీ చేసే స్థానం విషయంలో కూడా గెలుపు ఓటములను అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారని తెలుస్తొంది. సిద్దం సభలోనే ముద్రగడ పద్మనాభం చేరిక మూహూర్తం పెట్టుకుందామని చెప్పినట్లుగా సమాచారం.
Breaking: టీఎస్పీఎస్సీ గ్రూప్ -2, 3 పరీక్షల తేదీల ఖరారు