గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు కెరీర్ లో రాబోయో 27 వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇంతకముందు మహేష్ బాబు కి ఆగడు, బిజినెస్ మాన్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు థమన్. ఈసారి స్కై రేంజ్ ఆల్బం ని ఇవ్వడానికి సూపర్బ్ ట్యూన్స్ రెడీ చేస్తున్నారట.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్దిక నేరస్థుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్, బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక భారీ బ్యాక్ సెట్ ని నిర్మించారట. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ..14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కాగా ఈ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయో భారీ పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తాడని రాజమౌళి, మహేష్ అధికారకంగా వెల్లడించారు. అయితే ఆ సినిమా సెట్స్ మీదకి రావడాం 2022 లో అని తెలుస్తుంది. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీటయ్యాక మహేష్ సినిమాకి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ స్టార్ట్ చేస్తాడట. కాగా ఈ గ్యాప్ లో మహేష్ బాబు మరో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతుంది గాని అది ఎవరి దర్శకత్వంలో అని మాత్రం క్లారిటి రావడం లేదు. అందుకే ఈ ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వు బాబు ప్లీజ్..అంటూ మహేష్ బాబు వెంటపడుతున్నారట అభిమానులు.