PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అసోం పర్యటనలో భాగంగా కజిరింగ జాతీయ పార్క్ ను సందర్శించారు. అక్కడ ఏనుగుపై ఆయన సవారీ చేశారు. ఆ తర్వాత జీపులో సఫారీకి వెళ్లారు. శనివారం వేకువజామున అభయారణ్యంలోని సెంట్రల్ కొహోరారేంజ్ ను సందర్శించిన ప్రధాన మంత్రి మోడీ ఈ ఫారెస్ట్ లో ప్రకృతి అందాలను, జంతువుల ఫోటోలను కెమెరాలో బంధించారు.
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ పార్క్ లో తొలి సారి ప్రధాని మోడీ సెంట్రల్ కొహోరా రేంజ్ లోని మిహిముఖ్ ప్రాంతంలో పర్యటించారు. పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్ తో పాటు సీనియర్ అధికారులు మోడీ వెంట ఉన్నారు. సఫారీ అనంతరం ఏనుగులకు చెరకు గడలను తినిపించారు మోడీ. అక్కడ విధుల్లో ఉన్న మహిళా ఫారెస్ట్ గార్డులతో ప్రధాని మోడీ ముచ్చటించారు.
వీటికి సంబంధించిన ఫోటోలను మోడీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ కజిరంగ నేషనల్ పార్క్ ను సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించాలని మోడీ కోరారు. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం అస్సోం చేరుకున్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ ప్రారంభించారు. దాదాపు రూ.18వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
Telugu Doctor: ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి
This morning I was at the Kaziranga National Park in Assam. Nestled amidst lush greenery, this UNESCO World Heritage site is blessed with diverse flora and fauna including the majestic one horned rhinoceros. pic.twitter.com/68NEtoGAoz
— Narendra Modi (@narendramodi) March 9, 2024
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!