బీహార్ రాష్ట్రంలో అదేవిధంగా దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో ఊహించని విధంగా విజయాలు సాధించడంతో మంచి దూకుడు మీద ఉంది కమలం పార్టీ. ముఖ్యంగా తెలంగాణలో ఈసారి అధికారమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ ఆ రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ రాజకీయవర్గాలలో సంచలనాలు అవుతున్నాయి. మరోపక్క ఏపీలో తిరుపతి ఉప ఎన్నికలలో రాణించాలని ఏపీ బీజేపీ నేతలు కూడా సరికొత్త వ్యూహాలతో జనసేన పార్టీ తో కలిసి సమాలోచనలు చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో రెండు తెలుగు రాష్ట్రాల్ల బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ అదేవిధంగా సోము వీర్రాజు సమావేశం అవ్వటం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకొని శనివారం ఉదయం 11గంటలకు జేపీ నడ్డా నివాసంలో భేటీ అవ్వటం తో రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ నేతలు అధికార పార్టీలపై దూకుడుగా వ్యవహరించడం గ్యారెంటీ అని అభిప్రాయపడుతున్నారు. మరోపక్క జేపీ నడ్డా ఆరోగ్యం దెబ్బతినటంతో చాలా రాష్ట్రాల అధ్యక్షుల భేటీలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం కోలుకోవటం తో మళ్లీ స్టార్ట్ అయ్యాయని తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతో జేపీ నడ్డా సమావేశం కావడం పట్ల బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా బీజేపీ అధ్యక్షుడితో తెలుగురాష్ట్రాల బీజేపీ నేతలు భేటీ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.