Pro Kabaddi: నేడు అంటే అక్టోబర్ 10న 7.30 గంటలకు కంఠీరవ ఇండోర్ స్టేడియంలో యు ముంబా, యుపీ యోధాస్ కబడ్డీ మ్యాచ్ స్టార్ట్ అయింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ దబాంగ్ ఢిల్లీ కెసి 41-27 తేడాతో యు ముంబా జట్టు ఓడిపోయింది. యూపీ యోధాస్ తమ ప్రారంభ గేమ్లో జైపూర్ పింక్ పాంథర్స్ను 34-32తో ఓడించింది. ఈరోజు మ్యాచ్లో యు ముంబై తరఫున గుమాన్ సింగ్, సురీందర్ సింగ్ (సి), హరేంద్ర కుమార్, ఆశిష్, జై భగవాన్, రింకు, కిరణ్ మగార్ బరిలోకి దిగారు. సబ్స్టిట్యూట్గా శివమ్, రాహుల్, ప్రణయ్, సత్యవాన్, మోహన్ ఉన్నారు. యూపీ యోధాలో పర్దీప్ నర్వాల్, అషు సింగ్, శుభమ్ కుమార్, సురేందర్ గిల్, రోహిత్ తోమర్, నితేష్ కుమార్ (సి), సుమిత్ స్టార్టింగ్ సెవెన్గా దిగారు.
Pro Kabaddi: అనుభవం లేని ప్లేయర్స్
ప్రారంభంలో దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో యు ముంబా ఆటగాళ్లలో ఇన్ఎక్స్పీరియన్స్ స్పష్టంగా కనిపించింది. యూ ముంబా ఈసారి సీజన్లో మొత్తం యువకులతోనే దిగింది. ఈ అనుభవం లేని ఆటగాళ్లకు మ్యాట్పై కలిసికట్టుగా ఎలా ఆడాలో తెలియడం లేదు. ఈ ప్లేయర్స్ గేమ్స్ సెన్స్తో ఒకే స్ట్రాటజీతో ముందుకు వెళితేనే గెలిచే అవకాశం ఉంది. లేకుంటే, వారు ఈ సీజన్లో క్వార్టర్ ఫైనల్స్కి కూడా చేరుకోలేరు. గుమాన్ సింగ్ ఈ మ్యాచ్లో రాణిస్తే.. గెలిచే అవకాశం ఉంటుంది.
గెలిచేది వారే
యూపీ యోధాస్ జైపూర్ పింక్ పాంథర్స్పై అతికష్టం మీద విజయం సాధించారు. ఈ మ్యాచ్ సెకండ్ హాఫ్లో పర్దీప్ నర్వాల్ ఎక్కువ పాయింట్ తీసుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో ఖాతా తెరవడంలో విఫలమైన ఈ సూపర్ స్టార్ రైడర్ సెకండ్ హాఫ్లో ఏడు పాయింట్లు సాధించాడు. యూపీ యోధాస్ ప్లేయర్ పర్దీప్ ఇప్పుడు కూడా యు ముంబాపై మంచి ఆట ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇక సురేందర్ గిల్ కూడా పాయింట్స్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పోటీలో యు ముంబాను యూపీ యోధాస్ టీమ్ ఓడించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్ ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంది. ఒకవేళ పర్దీప్ ఫెయిల్ అవుతే మాత్రం యూపీ యోధాస్ గెలిచే ఛాన్స్ ఉంటుంది.