Weather Update: బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఈ నెల 26న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 27వ తేదీ నాటికి అది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అనంతరం పశ్చిమ – వాయువ్య దిశగా కదిలి 29 నాటికి అగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుంది. మరో వైపు ఏపీలో దిగువ ట్రోపో అవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతారణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలో కొన్ని చోట్ల శని, ఆదివారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు అగ్నేయ దిశలో 6 -10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షాల వల్ల తెలంగాణలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సగటున పగటి పూట 28 – 32 డిగ్రీల మధ్య, రాత్రిపూట 17-19 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
మరో వైపు వర్షం ఎపెక్ట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై కూడా పడుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటనలు, సభలు ప్లాన్ చేసుకున్న నేతలు .. వర్షం కారణంగా వాటిని వాయిదా వేసుకోవాల్సి వస్తొంది. నేడు హైదరాబాద్ లో జరగాల్సిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వద సభ వాయిదా పడింది. వర్షాల వల్ల ప్రజా ఆశీర్వాద సభ రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమైయ్యారు. వర్షాలు దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు పడే సమయంలో చెట్ల కింద ఉండకూడదని, ఇళ్ల నుండి బయటకు రాకూడదని సూచించారు. ముఖ్యంగా అకాల వర్షాల వల్ల అరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
Telangana Election 2023: సీఎం కేసిఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం కీలక హెచ్చరికలతో నోటీసులు