న్యూఢిల్లీ: రాజ్యసభ బిజెపిలో టిడిఎల్పి విలీనాన్ని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ఆమోదించారు. టిడిపి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి రామ్మోహనరావులు నిన్న బిజెపిలో చేరారు. మెజార్టీ టిడిపి సభ్యులు చేరినందుకు బిజెపిలోకి టిడిఎల్పిని విలీనం చేయాలని లేఖ ఇచ్చారు. తెదేపా పక్షాన్ని బిజెపిలో విలీనం చేసుకుంటున్నామని పేర్కొంటూ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖను బిజెపి నేతలు ఉపరాష్ట్రపతికి ఇచ్చారు దీనిపై పరిశీలన చేసిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు టిడిఎల్పి విలీనాన్ని ఆమోదించారు. దీంతో రాజ్యసభలో టిడిపి సభ్యులు ఇద్దరే మిగిలారు. ఈ విషయాన్ని రాజ్యసభ వెబ్సైట్లో పేర్కొన్నారు.
previous post
next post