(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అయిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు సంస్థలు, ప్రముఖులు యోగా వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. యోగాసనాలు వేశారు. యోగాసనాల ప్రాముఖ్యత, ఉపయోగాలను వివరించారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ప్రభాత్ తారా మైదానంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన భారీ కార్యక్రమానికి ప్రధాని మోది స్వయంగా నేతృత్వం వహించారు. దాదాపు 40వేల మంది యోగా అభ్యాసకులతో మోది ఆసనాలు వేశారు. ప్రతిదేశం యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని మోది పిలుపునిచ్చారు. ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనం యోగ అని మోది పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ తదితర ప్రముఖులు పాల్గొని ఆసనాలు వేశారు. యోగాను ఒక వేడుకలా భావించకుండా ప్రతి రోజు సాధన చేయాలని ఈ సందర్భంగా రామ్నాధ్ కోవింద్ సూచించారు. ఎయిర్ పోర్స్ స్టేషన్ యూనిట్ బృందం, బ్రహ్మకుమారీస్, తదితరులు ఆసనాలు వేశారు.
ఆర్మీడాగ్ యూనిట్ వేసిన ఆసనాలు చూపరులను ఆకట్టుకున్నాయి.