ముఖేశ్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ సంస్థ ఎప్పటికప్పుడు సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. టెలికాంలో జియోతో మాదిరిగానే ఈ-కామర్స్ లో కూడా తన సత్తా చూపించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దేశంలోని 200 నగరాల్లో ప్రారంభించిన కిరాణా డెలివరీ సేవలను మరిం విస్తృతం చేయనుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల కోసం కొత్త యాప్ ఆవిష్కరించింది. దీంతో జియో మార్ట్ ద్వారా అన్ని ఆర్డర్లపై ఫ్రీ డెలివరీ చేయనుంది. జూలై 15న ముఖేశ్ అంబానీ కంపెనీ వార్షిక సమావేశంలో జియో మార్ట్ ప్రణాళికలను వివరించారు. ఇందులో భాగంగా జియో మార్ట్ యాప్ గూగుల్ లో లభ్యమవుతుందని ప్రకటించారు.
రిలయన్స్ తన వన్, రోన్ను జియో మార్ట్కు కూడా విస్తరించింది. వీటి ద్వారా వినియోగదారులకు అనేక బ్రాండ్లు, ఉత్పత్తులపై ప్రత్యేకమైన ఆఫర్లతో పాటు, రోన్ పాయింట్లు, ఐదు శాతం డిస్కౌంట్ ను కూడా ఇస్తామని ప్రకటించింది. దీంతో గూగుల్ ప్లే స్టోర్లో ఇప్పటికే 10వేలకు పైగా యాప్ డౌన్ లోడ్లతో దూసుకెళ్తోంది. జియో మార్ట్ వెబ్ సైట్ లో ఇప్పటికే రోజుకు 2,50,000 ఆర్డర్లు వస్తున్నాయని జియో వెల్లడించింది.
మొన్నటి వరకూ జియోమార్ట్ లో 750 కంటే ఎక్కువ ఆర్డర్లకు మాత్రమే ఉచిత డెలివరీ అందించేది. అమెజాన్ 799 రూపాయల పైన ఉచిత డెలివరీ అందిస్తోంది. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ కనీస విలువ 600.. ఉచిత డెలివరీకి రూ.1,200 విలువైన ఆర్డర్ ఇవ్వాలి. జియో మార్ట్లో ప్రతి మొదటి ఆర్డర్కు కోవిడ్-19 ఎసెన్షియల్ కిట్ అందిస్తామని ముఖేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.