వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఎవరికీ సాధ్యం కాని ఊపులో ఉన్నాడు. వారానికి ఒక సినిమా… రోజుకో ట్రైలర్… గంటకు ఒక అప్డేట్ తో తన ఆర్జివి వరల్డ్ థియేటర్ ను పరుగులు పెట్టిస్తున్నారు.
మొన్న ‘పవర్ స్టార్’ సినిమా తో సంచలనం సృష్టించిన ఆర్జీవి.. తన తర్వాత సినిమా ‘అల్లు’ అని మెగా ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేయబోతున్నాడు. మధ్య మధ్యలో తనదైన శైలిలో హాట్ హాట్ చిత్రాలను తెరకెక్కిస్తున్న ఆర్జీవి…. ఇప్పుడు నేషనల్ మీడియా సెలబ్రిటీ అర్నాబ్ గో స్వామి ని టార్గెట్ చేశాడు.
ఇక ఆ సినిమా టైటిల్ ఏమిటంటే… “అర్నాబ్ ద ప్రాస్టిట్యూట్.” రిపబ్లిక్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ అర్నాబ్ గోస్వామి గురించి తెలియని భారత రాజకీయ వాదులు మరియు నేషనల్ రాజకీయాలంటే ఆసక్తి గల వారు ఉండరు. అతను ఇతరుల మీద ఆధారపడి బ్రతికే మనిషి అని.. ఇక తనని ఒక ప్రాస్టిట్యూట్ తో పోల్చడం వెనుక ఉన్న కారణాలు సినిమాల్లో చూపిస్తాను అని వర్మ అంటున్నాడు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!