ఏపీ అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ఉన్న నగరి ఎమ్మెల్యే, ప్రస్తుతం మంత్రి ఈ సారి అక్కడ నుంచి స్థానచలనం తప్పదనే ప్రచారం గట్టిగా నడుస్తోంది. జగన్ ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలను ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రోజాకు కూడా ఈ సారి స్థానచలనం తప్పేలా లేదు. 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ రోజా నగరి నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతోనే విజయం సాధించారు.
ఆమెకు నగరి నియెజకవర్గంలో ముందు నుంచి వర్గపోరు ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజాకు వ్యతిరేకంగా కొందరిని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారని ఆమె ఓపెన్గానే ఆరోపణలు చేస్తోంది. అయితే ఇప్పుడు స్టేట్లోనే పెద్దిరెడ్డి, ఆయన తనయుడు మిథున్రెడ్డి హవా నడుస్తుండడంతో రోజా ఏం చేయలేక నిస్సహాయ స్థితిలోనే నగరిలో నెట్టుకొస్తోంది. ఇక ఇప్పుడు రోజాకు నగరిలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. గత రెండు ఎన్నికల్లోనూ స్వల్ప మెజార్టీతో గెలిచిన రోజా ఈ సారి నగరిలో పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతుందని ఐ ప్యాక్ సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయట.
దీనికి తోడు పెద్దిరెడ్డి జిల్లాలో చాలా మందికి చాపకింద నీరులా చెక్పెట్టేస్తూ స్థానాలు మార్పించేస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను ఎంపీలుగా పంపేలా చక్రం తిప్పారు. ఇప్పుడు రోజాకు కూడా నగరి నుంచి తప్పించి ఒంగోలు లోక్సభ బరిలో దింపేలా పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తోందట. ఏమాటకు ఆమాట అసలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోజా రాజకీయమే పెద్దిరెడ్డికి పెద్దగా ఇష్టం ఉండదన్న టాక్ ముందు నుంచి ఉంది.
గత నాలుగేళ్లలో నగరి నియోజకవర్గంలో పదవులు కూడా పెద్దిరెడ్డి చెప్పిన వాళ్లకే దక్కాయి. అందుకే ఈ సారి పెద్దిరెడ్డి అండ్ కో వ్యూహాత్మకంగా రోజాను ఒంగోలు లోక్సభకు పంపేలా ప్లాన్ చేసిందంటున్నారు. ఇక రోజా ప్లేస్లో పెద్దిరెడ్డికి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్న శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డికి ఇప్పించాలని చూస్తున్నారు. చక్రపాణిరెడ్డితో పాటు ఈడిగ కార్పోరేషన్ చైర్మన్ శాంత, కుమార్ దంపతులు కూడా నగరిలో పెద్దిరెడ్డి వర్గంగా ఉంటున్నారు.
నగరిలో ఎలాగైనా రోజాకు చెక్పెట్టి ఈ సారి టిక్కెట్ లేకుండా చేయాలని డిసైడ్ అయిన పెద్దిరెడ్డి బీసీ కోటాలో సీటు మారిస్తే శాంతకు , రెడ్డి వర్గానికే సీటు ఇవ్వాలనుకుంటే చక్రపాణిరెడ్డికి ఇప్పించుకోవాలని ముందు నుంచే ప్లానింగ్తో ఉన్నారని.. దానికి అనుగుణంగానే కొన్ని నెలల నుంచే చాపకింద నీరులా వర్క్ చేసుకుంటూ వచ్చి ఎట్టకేలకు రోజాకు చెక్ పెట్టేశారని తెలుస్తోంది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!