సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా తర్వాత టాలీవుడ్ లో సాయి పల్లవి రేంజ్ మారిపోయింది. సహజమైన కథలను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు శేఖర్ కమ్ముల కి నేచురల్ పర్ఫార్ అయిన సాయి పల్లవి లాంటి హీరోయిన్ దొరికితే ఇండస్ట్రీకీ ఫిదా లాంటి ఫీల్ గుడ్ సినిమాలొస్తాయని ప్రూవ్ చేశారు. ఏ దర్శకుడికైనా కథ లో తను రాసుకున్న పాత్ర కి న్యాయం చేయగలిగే హీరో, హీరోయిన్ దొరకడం చాలా కష్టం.
అంతేకాదు ఒక దర్శకుడుకి నటులకి మధ్య అనుబంధం కూడా సినిమా అని కాకుండా వ్యక్తిగత విషయాలలో కూడా సలహాలిచ్చే లా ఉంటే వాళ్ళ నుంచి పవర్ ప్యాక్ లాంటి సినిమాలొస్తాయి. అలాంటి దర్శకులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నప్పటికి కొందరు కొంత మందికి మాత్రమే కనెక్ట్ అవుతారు. అలాంటి వాళ్ళలో శేఖర్ కమ్ముల ఒకరు. తన మొదటి సినిమా డాలర్ డ్రీంస్ నుంచి గత చిత్రం ఫిదా వరకు తన వద్ద ఉన్న టీం తో పాటు తను పనిచేసే నటీ నటులకి గొప్ప సలహాలిస్తుంటారు.
ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త వాళ్ళని పరిచయం చేశారు. వాళ్ళు ఈరోజు స్టార్స్ గా వెలుగుతున్నారు. అంతేకాదు మొదటి సినిమా సక్సస్ కాకపోయినా కూడా శేఖర్ కమ్ముల సినిమాలో నటించి స్టార్ గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో తమన్న, సాయి పల్లవి కళ్ళ ఉందు కనిపించే ఉదాహరణ. అయితే సాయి పల్లవి తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రెండవ సినిమాగా లవ్ స్టోరీ చేసింది.
త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా .. తనకి శేఖర్ కమ్ముల దర్శకుడి కంటే ఎక్కువని.. నేను ఇప్పుడు చూస్తున్న జీవితాన్ని ఆయన చూపించిందే అంటూ గొప్పగా చెప్పుకొచ్చింది. రెండు, మూడు సినిమాలు చేసిన కొందరు హీరోయిన్స్ కూడా ఒక దర్శకుడి మీద ఇంత కృతజ్ఞత భావాన్ని చూపించరు. ఈ విషయంలో సాయి పల్లవి గ్రేట్ అని చెప్పాలి.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!