ఏపీ సీఎం వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వైసిపి పార్టీ క్యాడర్ కార్యకర్తలు నాయకులంతా కలిసి భారీ స్థాయిలో జగన్ బర్తడే రాష్ట్రంలో జరిపారు. చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇదే సమయంలో మహిళలకు చీరలు కూడా పంపిణీ చేశారు. అదేవిధంగా రక్తదాన కార్యక్రమాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి.
ఈ రక్తదానం కార్యక్రమానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో బ్లడ్ డొనేషన్ లో వైసీపీ కార్యకర్తలు తమ అభిమాన నేత జగన్ పుట్టినరోజు నాడు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం ఇప్పుడు సంచలనం అయ్యింది. ఒకేరోజు 34 వేల యూనిట్స్ రక్తం సేకరించటం అనేది మామూలు విషయం కాదని వైద్య నిపుణులు తెలిపారు. ప్రజా సేవ కార్యక్రమాల్లో వైసీపీ శ్రేణులు వ్యవహరించిన దానిపై పార్టీ సీనియర్లు సైతం హర్షం వ్యక్తం చేశారు.
కేవలం వైసీపీ పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు ఈ రెస్పాన్స్ వచ్చిందంటే జగన్ పిలుపునిస్తే లక్ష వేల యూనిట్ల రక్తం గ్యారెంటీగా సేకరించడం జరిగేదని మరి కొంతమంది తాజా రికార్డు పై కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా జగన్ పుట్టినరోజు నాడు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ఒక వరల్డ్ రికార్డు కోసం కాకుండా సేవా దృక్పథంతో చేసిన.. ఇది ప్రపంచ రికార్డుగా మారటం గొప్ప విషయం అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు.