ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించిన వెంటనే ప్రతిపక్షాలకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. గవర్నర్ ఆమోదించిన చట్టాల రాజ్యాంగ బద్ధతను సమీక్షించేందుకు న్యాయస్థానం నిర్ణయించుకుంది. అలాగే ప్రభుత్వం తమ వాదనను వినిపించేందుకు కూడా ఇక్కడ అవకాశం కల్పించిన విషయాన్ని ప్రతిపక్షాలు మర్చిపోతున్నారు. ఈ స్టే ను కారణంగా చూపుతూ… అటు రాజీనామాల విషయంలో అసెంబ్లీ రద్దు, శాసనసభ్యుల రాజీనామా డిమాండ్ పై అధికార పార్టీ విరుచుకుపడుతూ ఉంటే తెలుగుదేశం కూడా కావాలని కవ్వింపు చర్యలు మొదలు పెట్టగా… ఈ రెండు పార్టీల రాజకీయాల మధ్య అసలు సమస్య మరుగున పడిపోతుందని ప్రతిపక్షాలు ఆశాభావంతో ఉన్నారు. అయితే మూడు రాజధానులకు చట్టబద్ధత కల్పించిన తర్వాత వైసిపి దూకుడుని, వ్యూహాన్ని ప్రతిపక్షాలు గమనించకలేకపోతున్నాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే ….న్యాయసమీక్ష ద్వారా వైసిపి ఒకటే వాదనను బలంగా హైకోర్టులో వినిపించాలని చూస్తోంది. అమరావతి రాజధానిగా ఉంటుందన్న మాటను నొక్కి చెప్పడమే కాకుండా సాంకేతికంగా ఈ విషయాన్ని మరిచిపోవద్దని హైకోర్టు వారు తెలియజేస్తారు. అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరణ కు మరో రెండు కేంద్రాలు తాము ఆపాదింఛుకున్న విధానపరమైన నిర్ణయంగా చెప్పాలనుకుంటుంది.. న్యాయస్థానం రాజ్యాంగ విరుద్ధమైతే తప్ప ప్రభుత్వ విధానపరమైన విషయలలో సాధారణంగా జోక్యం చేసుకోలేవు.
రైతులతో కుదిరిన ఒప్పందంలో సైతం రాజధాని అనేది ఒక ఒడంబడిక అని.. దనిని గౌరవిస్తూనే తాము రాష్ట్ర విభజనను ప్రజల అవసరాలకు తగ్గట్లు సవరణలు చేసి అమలు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చే యోచనలో ఉంది. అందువల్ల ప్రభుత్వంతో విబేధింజించడం కోర్టుకు అంత సులభం కాదు. ఇక సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్ భవన్ విశాఖకు తరలి వెళ్తాయి కాబట్టి… రాజధాని అవుతుంది అమరావతి లాంఛనప్రాయమైన అవశేషంగా మిగిలిపోతుంది.
ఇక రేపో ఎల్లుండో కోర్టులో ఇదే జరుగుతుంది అని వైసిపి వర్గాలు ఎంతో నమ్మకంతో ఉన్నాయి. అదే కనుక జరిగితే ప్రజలంతా టిడిపి చేతకానితనం పై దుమ్మెత్తి పోస్తారు. అలాగని రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తమ సత్తా నిరూపించుకోవడం అనేది టిడిపికి ఆత్మహత్యా సదృశ్యం అని రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. ఇక వైసీపీ వేసిన ప్లాన్ కి టిడిపి దగ్గర సరైన జవాబు ఉందా అంటే… మన తమ్ముళ్లు తల పక్కకి తిప్పుకుని వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.