యువ హీరో అక్కినేని అఖిల్ కు స్టార్ హీరో కొడుకుగా ఎంతో క్రేజ్ ఉంది. చిన్నప్పుడెప్పుడో సిసింద్రీ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. గ్రాండ్గా చిత్రరంగ ప్రవేశం చేసిన అఖిల్ మొదటి రెండు సినిమాలు ఎలాంటి నష్టాలనైతే మిగిల్చాయో రీసెంట్ గా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది.
ఈ నేపధ్యంలో 20 కోట్ల బడ్జెట్ పెడితే కనీసం సగం వసూళ్లను కూడా రికవర్ చేయలేకపోతున్నాడు అనే టాక్ ఫిలిం వర్గాల్లో చర్చించుకుంటున్నారట. దీని వల్ల బయటి నిర్మాతలు అఖిల్ సినిమాకు హై బడ్జెట్ పెట్టలేకపోతున్నారని చెప్పుకుంటున్నారట. ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా అఖిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయనున్నాడట. అఖిల్ కెరీర్ లో ఇది ఐదో సినిమా కాగా, సురేందర్ రెడ్డికి పదో చిత్రం కావడం విశేషం. ఈ మూవీని ‘సరిలేరు నీకేవ్వరు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి లు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. అఖిల్, సురేందర్ రెడ్డి స్టైలిష్ కాంబోపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో స్టార్ట్ కానుందని సమాచారం.
ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం సుమారు 40 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తున్నారట మేకర్స్. ఇప్పటి వరకు ఫాంలోకి రాక, ఒక్క హిట్ కూడా అందుకోలేని అఖిల్ మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారట. అయితే ఇప్పటి వరకు స్టార్ హీరోలతో సినిమాలు రూపొందిస్తూ వస్తున్న సురేందర్ రెడ్డి.. అఖిల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకోకుండా బడ్జెట్ లెక్కలు వేస్తున్నారని, అదీగాక పవర్ స్టార్ ప్రాజెక్ట్ చేతిలో ఉన్న సురేందర్ రెడ్డి, అఖిల్ కోసం చాలా రిస్క్ చేస్తున్నాడని కామెంట్స్ కూడా మొదలైయ్యాయని తెలుస్తుంది. ఎవరేమనుకున్న ఈ స్టైలిష్ కాంబో అందరి అంచనాలు అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఇద్దరు గట్టి పట్టుదలతో ఉన్నారట.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!