NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

YSRCP:  ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీలకు భారీగా షాక్ లు ఇచ్చారు ఆ పార్టీల నేతలు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనేక నియోజకవర్గాల్లో ఆశావహులకు టికెట్ లు దక్కలేదు. దీంతో ఆయా పార్టీల్లో అసంతృప్తి నేతలు వలస బాట పట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వివిధ జిల్లాలకు చెందిన నేతలు వైసీపీలో చేరారు.

రాజంపేట మాజీ టీడీపీ ఇన్ చార్జి గంటా నరహరి మంగళవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. చాలా కాలంగా టీడీపీ రాజంపేట ఇన్ చార్జిగా ఉన్న గంటా నరహరి ఈ నెల 13వ తేదీన జనసేన పార్టీలో చేరారు. అయితే రాజంపేట లోక్ సభ స్థానాన్ని టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ని అభ్యర్ధిగా ఆ పార్టీ కేటాయించింది. అటు టీడీపీలో ఆ తర్వాత జనసేనలోనూ ఆయనకు టికెట్ లభించే పరిస్థితి లేకపోవడంతో జనసేన పార్టీకీ గుడ్ బై చెప్పారు గంటా నరహరి. ఇవేళ సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరగా, ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిధున్ రెడ్డి, ఒంగోలు లోక్ సభ వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొన్నారు.

అలానే నూజివీడు  మాజీ ఎమ్మెల్యే, మాజీ బీజేపీ నేత చిన్నం రామకోటయ్య కూడా వైసీపీలో చేరారు. విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పోరేటర్లు, జనసేన నాయకులు వైసీపీలో చేరారు. మాజీ కార్పోరేటర్ లు గండూరి మహేష్, నందెపు జగదీష్, మాజీ కోఆప్షన్ సభ్యుడు కొక్కిలిగడ్డ దేవమణి, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర సెక్రటరీ కోనూరు సుబ్రమణ్యం (మణి), మాజీ డివిజన్ అధ్యక్షుడు గోరంట్ల శ్రీనివాసరావు, జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గ నాయకుడు బత్తిన రాము తదితరులు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, వైసీపీ అభ్యర్ధి కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ లు పాల్గొన్నారు.

అలానే విశాఖకు చెందిన సీనియర్ నాయకులు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జీవి రవిరాజు, బొగ్గు శ్రీనివాస్, జనసేన నాయకురాలు బొడ్డేటి అనురాధ లు జగన్ చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గుడివాడ అమరనాథ్, విశాఖ నార్త్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కేకే రాజు పాల్గొన్నారు. అదే విధంగా సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు కూడా వైసీపీలో చేరారు. సూళ్లూరుపేటకు చెందిన వేనాటి రామచంద్రారెడ్డి, వెంకటగిరికి చెందిన మస్తాన్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ అంగలూరి లక్ష్మీశివకుమారి, గొరకపూడి చిన్నయ్య దొర తదితరులు వైసీపీలో చేరారు.

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

Related posts

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?