అమరావతి: మీరు చదువుకోండి, ఫీజులు మేము కడతాం అని జగన్మోహనరెడ్డి ప్రచారం చేసుకున్నారనీ, ఇప్పుడు ఫీజులు అడిగితే లాఠీలతో కొడుతున్నారనీ టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు.
విజయనగరం జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని కోరుతూ విద్యార్థులు నిరసన తెలియజేస్తుంటే పోలీసులు లాఠీలతో కొట్టి ఈడ్చుకుంటూ వెళుతున్న ఫోటోలను లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో ట్యాగ్ చేసి ప్రభుత్వ చర్యలను విమర్శించారు.
శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులను లాఠీలతో చావబదతారా? గిరిజన సంక్షేమ గృహాల్లో వసతులు పెంచమని కోరడమే తప్పా? ప్రభుత్వానికి గిరిజన సంక్షేమం మీద ఉన్న శ్రద్ధ ఇదేనా? అని లోకేష్ ప్రశ్నల వర్షం కురిపించారు. మూడు గంటలు మండు టెండలో నిరసన చేసినా విద్యార్థుల సమస్యలు వినే తీరిక ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని లోకేష్ విమర్శించారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ తన మాటలను చేతల్లో చూపి రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు తీర్చాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.
మీరు చదువుకోండి ఫీజులు మేము 'కడతాం' అని ప్రచారం చేసుకున్న జగన్ గారు ఇప్పుడు ఫీజులు అడిగితే 'కొడతాం' అంటున్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్సుమెంటు బకాయిలను చెల్లించమంటూ మూడు గంటలు మండుటెండలో నిరసన చేసినా విద్యార్థుల సమస్యలు వినే తీరిక ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. pic.twitter.com/x7vGuCWkhd
— Lokesh Nara (@naralokesh) August 23, 2019