అమరావతి: జాతీయ ఉపాధి హామీ పధకం కింద చేసిన పనులకు నిధులు విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో శుక్రవారం అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శన చేశారు.
ఈ సందర్బంగా పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యావహారిస్తుందని మండిపడ్డారు. ఉపాధి నిధులను వేరే వాటికి మళ్లించారని ఆరోపించారు. పెద్ద కాంట్రాక్టర్లకు నిధులు ఇస్తూ చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు లు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉపాధి చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
previous post
next post