ఓటమి అనేది గుణపాఠం నేర్పుతుంది. అపజయమే భవిష్యత్తు విజయానికి సోపానాలు అని కూడా అంటారు. అయితే ఇప్పుడు ఎందుకు ఓడిపోయామన్నది
కరెక్ట్ గా పట్టుకోగలిగితేనే మళ్లీ ఆ తప్పు చేయకుండా సరిదిద్దుకోవడానికి వీలు ఉంటుంది. తద్వారా తిరిగి విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు విషయానికొస్తే అదేమీ పట్టించుకోవడంలేదు. 23 సీతతో ఘోర పరాజయాన్ని చవిచూసిన చంద్రబాబు ఎందుకు ఈ పరిస్థితి తలెత్తిందని పోస్టుమార్టం కూడా చేసుకోకుండా ఇప్పటికీ పాత డబ్బానే మోగిస్తూ జూమ్ కాన్ఫరెన్స్ను నిర్వహించడం పట్ల నిర్వహిస్తుండడం పట్ల టీడీపీ వర్గాల్లోనే నిర్వేదం వ్యక్తమవుతోంది .నిజానికి నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం చంద్రబాబు సొంతం.
ఏకంగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారాయన. అలాంటి చంద్రబాబుకి తమ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలియదని ఎలా అనుకోగలం.? తెలియనట్టు నటిస్తున్నారంతే.! 2018 చివరినాటికి పోలవరం ప్రాజెక్టుని ఓ కొలిక్కి తెచ్చేస్తామని ఇదే చంద్రబాబు గతంలో చెప్పారు. అమరావతి ఫేజ్ వన్ని 2018 చివరి నాటికే పూర్తి చేసేస్తామని కూడా అన్నారు. ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. జిల్లాకి ఓ ఎయిర్ పోర్ట్ అన్నారు.. స్మార్ట్ సిటీలన్నారు.. ఏవీ జరగలేదు.మాటలేమో కోటలు దాటేశాయి.. చేతలేమో గడప దాటలేదు.ఫలితంగా 2019 ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని టీడీపీ చవిచూసింది .అధికారం పోయాక కూడా చంద్రబాబు తీరు మారలేదు.
అన్నీ చేసేశామంటున్నారు.రాష్ట్రంలో 13 జిల్లాల్ని అభివృద్ధి చేశాం.. అక్కడ అది చేశాం.. ఇక్కడ ఇది చేసేశాం.. బస్తీ మే సవాల్.. ఏడాది కాలంలో మీరేం చేశారో చెప్పండి..’ అంటూ తాజా జూమ్ కాన్ఫరెన్స్లో వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు సవాల్ చేశారు.తమఅధినేత ప్రగల్భాలు చూసి టిడిపి వర్గాలు నవ్వుకుంటున్నాయి. చింత చచ్చినా పులుపు చావలేదు అని సెటైర్లు పడుతున్నాయి. చంద్రబాబు వైఖరి మారకుంటే 2024లో కూడా తమ పార్టీ తమ పార్టీ పరిస్థితి మారబోదని టీడీపీ నేతలు అంటున్నారు.