(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయంగా ఓ పక్క విమర్శలు చేస్తూనే మరో పక్క కేంద్రం నుండి కావాల్సిన పలు అంశాలపై విజ్ఞప్తులు చేస్తుంటారు కేసీఆర్.
ఈ క్రమంలోనే ఓ ప్రధాన అంశాలపై ప్రధాన మంత్రి మోడీకి కేసీఆర్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్వే పరీక్ష లను రెండు భాషల్లోనే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిపైన కేసీఆర్ మోడీకి లేఖ రాశారు. రైల్వే పరీక్ష లను ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించేందుకు అనుమతించాలని ప్రధాని మోడీని కోరారు. ప్రాంతీయ భాషల్లో రైల్వే పరీక్షలు నిర్వహించడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కెసిఆర్ మోడీని కోరారు.
మరోపక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు కేసీఆర్ లేఖ రాశారు. దేశ మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు స్మారక తపాలా స్టాంప్ కు అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్ రాష్ట్రపతి రామ్నాథ్ గోవింద్ ను కోరారు. పీవీ స్మారక స్టాంపు ను హైదరాబాదులో విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.