Telangana High Court: ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి ఒక కేసులో ప్రస్తుత టీటీడీ చైర్మన్, జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి నిందితుడుగా ఉన్నారు. ఇందూ – హౌసింగ్ బోర్డు కేసులో సుబ్బారెడ్డి పై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే తనపై కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన 2016 లో తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఏకసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి లో తీర్పును రిజర్వ్ చేసింది.
జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తాజాగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చివరి రోజైన గురువారం జస్టిస్ ఉజ్జల్ భుయాన్ .. సుబ్బారెడ్డి పిటిషన్ ను ఆర్డర్ రిజర్వ్డ్ క్యాప్షన్ నుండి విడుదల చేశారు. దీంతో నూతనంగా బాధ్యతలు చేపట్టే ప్రధాన న్యాయమూర్తి లేదా రోస్టర్ ఉన్న న్యాయమూర్తి ఈ కేసులో మొదటి నుండి వాదనలు వినాల్సి ఉంటుందని సమాచారం.
ఏపీ వర్సెస్ తెలంగాణ ..మంత్రుల మధ్య మాటల యుద్దం ..మంత్రి బొత్సకు తెలంగాణ మంత్రుల సవాల్