ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజవర్గం టీడీపీలో హాట్ సీట్గా మారిపోయిం ది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచిపోటీ చేసిన తోట త్రిమూర్తులు.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఇక, ఈ సీటును మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ కుమారుడు.. సూర్య ప్రకాష్కు వైసీపీ అధినేత సీఎం జగన్ కేటాయించారు. ఈయనను బలంగా ఢీ కొట్టి.. తాము పాగా వేయాలనేది టీడీపీ వ్యూహం. ఈ నేపథ్యంలో బలమైన రామచంద్రపురం నియోజకవర్గాన్ని వదులు కోకుండా.. తన దగ్గరే పెట్టుకుంది.
ఇంత వరకు టీడీపీ సక్సెస్ అయినా.. అసలు సమస్య నేతల నుంచే మొదలైంది. ఇతర నియోజకవర్గాల కు భిన్నంగా ఇక్కడ నాయకులు మేమంటే మేమే అంటూ.. పోటీలో ఉన్నారు. ఏకంగా ఏడుగురు నాయకు లు టికెట్ కోరుతూ.. చంద్రబాబుకు లేఖలు ఇచ్చారు. దీంతో ఇక్కడ ఎవరిని ఎంపిక చేయాలనే వ్యవహా రం.. పార్టీకి ఇరకాటంగా మారింది. వాసంశెట్టి సుబాష్, డాక్టర్ కాడా వెంకటరమణ, రెడ్డి సుబ్రహ్మణ్యం, పిల్లి అనంతలక్ష్మి, కుడిపూడి వెంకటేశ్వరరావు, రెడ్డి అనంతకుమారి, మేడిశెట్టి సత్యనారాయణలు ప్రధానంగా పోటీలో ఉన్నారు.
వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా.. మిగిలిన వారు రెబల్ అయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. పిల్లి అనంతలక్ష్మి వైపు పార్టీ మొగ్గు చూపుతున్నా.. మిగిలిన వారిలోనూ బలమైన నాయకులు ఉన్నారు. వీరి విషయం కూడా చర్చకు వస్తోంది. వైసీపీలో ఇలాంటి రగడ లేకుండా.. ఒకే ఒక్క నాయకుడికి టికెట్ ఇచ్చారు. ఇక, ఇక్కడ సిట్టింగ్ను వేరే చోటకు మార్చేశారు. ఈ తరహా పరిస్తితి టీడీపీలో లేదు. దీనికితోడు పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది చంద్రబాబు బిగ్ టెస్ట్గా మారిపోయింది.
కుడిపూడి వెంకటేశ్వరరావు.. తనకు టికెట్ కేటాయించాలని యువగళం పాదయాత్ర సమయంలోనే నారా లోకేష్ను కోరానని ఆయన తనకు హామీ కూడా ఇచ్చారని చెబుతున్నారు. అదేవిధంగా మేడిశెట్టి సత్యనారాయణ పరిస్తితి కూడా దాదాపు ఇంతే ఉంది. ఎలా చూసుకున్నా.. రాజకీయంగా ఈ ఏడుగురిలో పిల్లి అనంతలక్ష్మి వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం మాజీ ఎమ్మెల్యే, సామాజిక సమీకరణలు, కుటుంబ నేపథ్యాన్ని భేరీజు వేసుకుని దాదాపు ఆమెవైపు మొగ్గు చూపడమే బెటర్ అని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.