గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అనేక చర్చలకు దారి తీసిన ఏపీలో అధికార పక్షమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు వ్యవహారం విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ పార్టీ పేరుతో మొదలైన జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ ఇప్పుడు వారి నోటీసులపై, పోస్టర్లపై మరియు లెటర్ హెడ్ ల పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును వాడుకుంటూ తమ పార్టీ పేరు ని దుర్వినియోగం చేస్తున్నారని అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇక ఆ పిటిషన్ కు సంబంధించిన విచారణ చేపట్టిన హైకోర్టు ఇందుకు సంబంధించి కౌంటర్ ను వెంటనే దాఖలు చేయాలని ఎలక్షన్ కమిషన్ కు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ అయిన యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీకి నోటీసులు పంపటం గమనార్హం. ఇక ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు ఈలోపల ఎలక్షన్ కమిషన్ మరియు అధికార యువజన రైతు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయవలసిందిగా సూచించింది.
కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా తనకు పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుల విషయంలో కూడా ఇదే పాయింట్ ను లేవనెత్తి విపరీతమైన రచ్చ చేశారు. అసలు తాను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుండి అయితే తనకు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి నోటీసులు వచ్చాయని…. ఇవి చెల్లవని ఆయన ఆరోపించారు.
ఇప్పుడు ఇదే పాయింట్ ను పట్టుకుని ఢిల్లీ లో మహమ్మద్ భాషా పిటిషన్ వేయగా హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా కూడా తీసుకుంది. ఇంకా దీనిపై స్పష్టమైన వివరణ జగన్ ప్రభుత్వం ఇవ్వలేకపోతే వారి పార్టీ గుర్తింపు రద్దు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక మహమ్మద్ భాష మాత్రం ఎన్నికల నియమావళి మరియు ప్రజాప్రాతినిధ్య నిబంధనల ప్రకారం జగన్మోహన్ రెడ్డికి చెందిన పార్టీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు వారిని కోరారు.